ప్రభుత్వ వైఖరిని ఎండగడతాం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు కొండా రాఘవరెడ్డి
ఇబ్రహీంపట్నం: తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో కూడా వైఎస్సార్ సీపీకి పటిష్టమైన ప్రజాబలముందని, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడుతూ.. రాబోయే రోజుల్లో తమ పార్టీకి ఉన్న ప్రజాదరణ ఏమిటో నిరూపిస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కొండా రాఘవరెడ్డి అన్నారు. ఈనెల 8న వైఎస్సార్ సీపీ నాయకురాలు షర్మిల ఇబ్రహీంపట్నంలో నిర్వహిస్తున్న పర్యటన వివరాలను ఆయన మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత చేపడుతున్న తొలి పర్యటనలో భాగంగా షర్మిల ఇబ్రహీంపట్నంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపడతారని, అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఇబ్రహీంపట్నంలో షర్మిల చేపట్టనున్న పర్యటన స్ఫూర్తితో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. కేవలం అధికారాన్ని దక్కించుకునేందుకు మాత్రమే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇబ్బడిముబ్బడిగా హామీలను గుప్పించిందని, ఎన్నికల అవసరం తీరాక ప్రజలకిచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. పింఛన్లు రాకపోవడంతో ఎంతో మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, దిక్కుతెలియని స్థితిలో రైతులు జీవన్మరణ పోరాటం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై ఇంకా నిర్దిష్టమెన కార్యాచరణ లేకపోడంతో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులపై నమ్మకం కోల్పోతున్నారని అన్నారు. షర్మిల పర్యటలనలో వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు ఏనుగు మహిపాల్రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు అమృతసాగర్, మంచాల మండల శాఖ అధ్యక్షుడు మాదగోని జంగయ్యగౌడ్, నేతలు దూసరి బాలశివగౌడ్, ఎండీ బాబు, ఎండీ ఖాలేద్భాయ్, తూర్పు ప్రభాకర్రెడ్డి, వి. బుగ్గరాములు, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు దొండ వినోద్రెడ్డి, యువజన విభాగం నాయకుడు నల్ల ప్రభాకర్ /పాల్గొన్నారు.
8న ఇబ్రహీంపట్నంలో షర్మిల పర్యటన
Published Tue, Dec 2 2014 11:25 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement