భద్రాచలం వద్ద గోదావరిలో యువకుడు గల్లంతు | Sakshi
Sakshi News home page

భద్రాచలం వద్ద గోదావరిలో యువకుడు గల్లంతు

Published Tue, Jul 14 2015 5:04 PM

Youth missing in Godavari

భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలంలో పుష్కర స్నానానికి వెళ్లిన ఓ యువకుడు గోదావరి నదిలో గల్లంతయ్యాడు. కొత్తగూడెం పట్టణానికి చెందిన పవన్ (సుమారు 20 సంవత్సరాలకు పైగా వయసు) పుష్కర ఘాట్‌లో స్నానానికి దిగి నదిలో కాస్త ముందుకు వెళ్లాడు. దాంతో గోదావరి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. సహాయక దళాలు బోట్లతో పవన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు.

Advertisement
Advertisement