చెల్లెల్ని ప్రేమించాడని చంపేశారు

చెల్లెల్ని ప్రేమించాడని చంపేశారు - Sakshi


కరీంనగర్(గోదావరిఖని): గోదావరిఖనిలోని ఎయిట్‌ఇన్‌క్లెయిన్ కాలనీలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. వివరాలు.. కాలనీకి చెందిన సదానందం(25), అదేకాలనీకి చెందిన పులిపాక సతీష్ చెల్లెలు ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వరసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. ఈ విషయం గురించి పలుమార్లు సతీష్, సదానందంను హెచ్చరించినా పెడచెవిన పెట్టడంతో పరువు పోతుందని భావించి సతీష్ కుటుంబసభ్యులంతా కలిసి గురువారం రాత్రి గొంతునులిమి చంపేశారు.



పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు న మోదు చేసుకున్నారు. వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సతీష్‌తో ఈ హత్యలో పాల్గొన్న కుటుంబసభ్యులు, అతని స్నేహితుడు కటిక శేఖర్‌లు పరారీలో ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top