విషజ్వరంతో మహిళ మృతి | woman died by fever in warangal district | Sakshi
Sakshi News home page

విషజ్వరంతో మహిళ మృతి

Jan 24 2015 7:52 PM | Updated on Sep 2 2017 8:12 PM

వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఎస్సీ కాలనీలో విషజ్వరంతో మహిళ మృతిచెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది.

స్టేషన్‌ ఘన్‌పూర్ (వరంగల్) : వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఎస్సీ కాలనీలో విషజ్వరంతో మహిళ మృతిచెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ఇంటి సమీపంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. కాలనీకి చెందిన చింత రాజమ్మ(40) మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స చేయించుకుంది. జ్వరం తగ్గకపోవడంతో శుక్రవారం హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున రాజమ్మ మృతిచెందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement