ఇద్దరు కూలీల దారుణ హత్య | Sakshi
Sakshi News home page

ఇద్దరు కూలీల దారుణ హత్య

Published Wed, Jul 1 2015 11:27 AM

two labors brutal murdered in te jagithyala

జగిత్యాల (కరీంనగర్): జగిత్యాల మండల కేంద్రంలోని గోవిందపల్లె కాలనీలో ఇద్దరు కూలీలను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. బండరాళ్లతో మోది పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేశారు. మృతులు పట్టణంలోని గోత్రాల కాలనీకి చెందిన కనకయ్య (40), భారతి (45)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement