అశ్వాపురంలో టీఆర్‌ఎస్ కార్యకర్తల వీరంగం | TRS workers attacks vehicals in Aswapuram | Sakshi
Sakshi News home page

అశ్వాపురంలో టీఆర్‌ఎస్ కార్యకర్తల వీరంగం

Jul 12 2014 11:04 AM | Updated on Sep 2 2017 10:12 AM

తెలంగాణ బంద్ సందర్భంగా ఖమ్మం జిల్లా అశ్వాపురంలో టీఆర్‌ఎస్ కార్యకర్తల వీరంగం సృష్టించారు.

ఖమ్మం: తెలంగాణ బంద్ సందర్భంగా ఖమ్మం జిల్లా అశ్వాపురంలో టీఆర్‌ఎస్ కార్యకర్తల వీరంగం సృష్టించారు. నేడు గురు పౌర్ణమి సందర్భంగా గుడికి వెళ్లివస్తున్న భక్తుల కార్లపై దాడి చేసి, అద్దాలు ధ్వంసం చేశారు. బంద్ అయినా వాహనాలు ఎలా నడుపుతారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.  మరోవైపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement