'చివరి రెండురోజులు కచ్చితంగా సభకు హాజరుకావాలి' | Telangana assembly members should be attended last two days | Sakshi
Sakshi News home page

'చివరి రెండురోజులు కచ్చితంగా సభకు హాజరుకావాలి'

Nov 27 2014 7:43 AM | Updated on Sep 22 2018 7:51 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్ హౌసింగ్ సొసైటీల్లో అవకతవకలపై చర్చించే అవకాశం ఉంది.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్ హౌసింగ్ సొసైటీల్లో అవకతవకలపై చర్చించే అవకాశం ఉంది. ఈ విషయమై టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు నోటీసులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయనున్నారు.

రేపు ద్రవ్యవినిమయ బిల్లును సభలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, తెలంగాణ అసెంబ్లీ చివరి రెండు రోజులు కచ్చితంగా సభకు హాజరుకావాలని సభ్యులను టీఆర్ఎస్ ఆదేశించినట్టు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement