విశాఖ–సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు | Special trains between Visakhapatnam and Secunderabad | Sakshi
Sakshi News home page

విశాఖ–సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

Jun 23 2017 12:19 AM | Updated on May 3 2018 3:20 PM

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్టణం–సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమా శంకర్‌కుమార్‌ గురువారం

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్టణం–సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమా శంకర్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విశాఖ– సికిం ద్రాబాద్‌ (08501/08502) ప్రత్యేక రైలు జూలై 4, 11, 18, 25, ఆగస్టు 1, 8, 15, 22, 29, సెప్టెంబర్‌ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 11 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12కు సికింద్రాబాద్‌ చేరుకుం టుంది. తిరుగు ప్రయాణంలో జూలై 5, 12, 19, 26, ఆగస్టు 2, 9, 16, 23, 30, సెప్టెంబర్‌ 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 4.30కు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.50కి విశాఖ చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement