రైతులపై ఇసుక మాఫియా దాడి | sand mafia attackes on formers in karimnagar distirict | Sakshi
Sakshi News home page

రైతులపై ఇసుక మాఫియా దాడి

Mar 18 2015 2:22 PM | Updated on Aug 28 2018 8:41 PM

కరీంనగర్ జల్లా ముస్తాబాద్ మండలంలో రైతులపై ఇసుక మాఫియా దాడులకు దిగింది.

ముస్తాబాద్: కరీంనగర్ జల్లా ముస్తాబాద్ మండలంలో రైతులపై ఇసుక మాఫియా దాడులకు దిగింది. మండలంలోని కొండాపూర్ గ్రామం సమీపంలో మానేరు వాగు నుంచి కొంత కాలంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. బుధవారం ఉదయం కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతుండగా వాగు వద్ద రైతులు అడ్డుకున్నారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, ఇసుకను తీయటానికి వీల్లేదన్నారు. దీంతో ఇసుక అక్రమ రవాణాదారులు రెచ్చిపోయారు. అడ్డుకున్న రైతులను తీవ్రంగా కొట్టి పరారయ్యారు. ఐదుగురు రైతులు స్పృహ తప్పి పడిపోగా.. స్థానికులు వారిని గుర్తించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement