అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ | robbery gang arrested in nizamabad | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Dec 11 2015 1:15 PM | Updated on Oct 17 2018 6:06 PM

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ - Sakshi

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నిజామాబాద్: తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ప్రధాన కార్యాలయంలో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన ఐదుగురు సభ్యుల ముఠాలో నలుగురిని గురువారం అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. పట్టుబడిన వారి నుంచి 61 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి ఆభరణాలు, ఒక పల్సర్ బైక్, రెండు చాకులు, మూడు ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నిజామాబాద్‌లో ఎనిమిది, మెదక్ జిల్లాల్లో ఆరు చోరీలకు పాల్పడినట్టు ఎస్పీ తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement