ఒంటె పాలు@ 600
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వేళ నగరంలో ఉంటున్న వలస జీవులు సొంత ప్రాంతాలకు తరలిపోతుండగా...రాజస్థాన్కు చెందిన కొందరు ఒంటెల యజమానులు మాత్రం ఉపాధి కోసం నగరానికి వలస వచ్చారు. ఒంటె పాలు లీటర్ రూ.600కు విక్రయిస్తున్నారు. తద్వారా కొద్దిగా ఆదాయం వస్తోందని వారు పేర్కొన్నారు. శుక్రవారం కొందరు ఒంటెల్ని మలక్పేట వద్ద నిలిపి మేత వేసి...నీళ్లు తాపించారు.