పైలట్‌ సురక్షితంగా తిరిగి రావాలి: అసద్‌ 

The pilot must come back safely - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాకిస్తాన్‌ భూభాగంలో కూలిపోయిన మిగ్‌ 21 విమా న పైలట్‌ సురక్షితంగా తిరిగి రావాలని ఎంఐ ఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆకాంక్షించారు. బుధవారం ఆయన ఈ మేరకు ‘వీర పైలట్‌ కోసం ప్రార్థన చేస్తున్నాం. అతని కుటుంబం ధైర్యంగా ఉండాలి’అని ట్వీట్‌ చేశారు. జెనీవా ఒప్పందంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం.. బందీలైన ఇతర దేశ సైనికుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలన్నారు. పైలట్‌ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత పాకిస్తాన్‌దేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పక్కన పెట్టి ఐఏఎఫ్‌ పైలట్‌ విషయంలో పాకిస్తాన్‌ మానవత్వంతో మెలిగి, అతన్ని వదిలేయాలన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top