జనాల మోజు... మెట్రో అందాల కనువిందు..! 

people loves to travel on metro train - Sakshi

నగరంలో మెట్రో పరుగులు సిటీకి కొత్త అందాలను పంచుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కనిపిస్తూ కొత్త బండి సాగుతోంది. మెట్రోలో ప్రయాణిస్తున్నవారు అద్దాల్లోనుంచి చూసి కింద రోడ్డుపై వెళుతున్న వాహనాల వరుసను ఆసక్తిగా చూస్తుంటే.. పైన వెళుతున్న కొత్త రైళ్లు కిందనున్నవారికీ అలాంటి ఆనందాన్ని అందిస్తున్నాయి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌పై నిల్చున్న ప్రయాణికులకు ఆ పక్కనే ఒలిఫెంటా వంతెన మీదుగా నిర్మించిన ఉక్కు వంతెన పట్టాలపై పరుగులు తీస్తున్న మెట్రో రైళ్లను ఆసక్తిగా చూస్తున్నారు. శనివారం కనిపించిన దృశ్యాలను సాక్షి కెమెరా బంధించింది. 

మెట్రోలో ప్రయాణించేందుకు శనివారం నగర వాసులు బారులు తీరారు. సెలవు రోజు కావడంతో మెట్రో రైలులో ప్రయాణించేందుకు మెట్రో స్టేషన్లకు చేరుకున్నారు. నాగోలు నుంచి మియాపూర్‌ వరకు ఉన్న స్టేషన్లన్నీ కిటకిటలాడాయి. మెట్రో గురించి తెలుసుకుంటూ, అక్కడి సౌకర్యాలు పరిశీలిస్తూ సరదాగా ప్రయాణం చేశారు.  ఆ ఫొటోలివి..

మియాపూర్‌ స్టేషన్‌లో...

అమీర్‌పేట్‌లో..

అమీర్‌పేట్‌లో..

టికెట్‌ కోసం..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top