
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లిలో పెను ప్రమాదం తప్పింది. సుచిత్ర సమీపంలో ఓలా క్యాబ్ మంటల్లో చిక్కుకుంది. నడిరోడ్డుపైనే కారు పూర్తిగా దగ్దమైంది. అందులో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇంజిన్ వేడెక్కి కారులో మంటలు చెలరేగాయని తెలుస్తోంది.