నిజామాబాద్ కల్చరల్ : అమెరికా అబ్బాయి.. ఇందూరు అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. మూడు ముళ్లు.. ఏడడుగులతో ఏకమయ్యారు. ఖండాంతరాలు దాటిన వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో గురువారం నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్రోడ్లో గల శ్రావ్యగార్డెన్లో వివాహం జరిగింది. అమెరికాలో ప్రేమించు కున్న జంట తెలుగు సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల సాక్షిగా వావాహం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడకు చెందిన సామలేటి సోమే శ్వర్ వరలక్ష్మీల ప్రథమ పుత్రిక అర్చన 2010లో ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లారు. 2014లో చదువు పూర్తి చేసి ఎంఫార్మసీ డ్రగ్ విభాగంలో ఉద్యోగంలో చేరి స్థిరపడి గ్రీన్కార్డు సంపాదించారు. ఈ క్రమంలో మ్యాట్రిమోని సైట్ ద్వారా అమెరికాలోని డెట్రాయిట్ మిచిగన్ సిటీకి చెందిన యానిమేషన్ డిజైనర్ శాన్ విన్ డ్యగ్ (వరుడు) పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి మే 2019లో అమెరికాలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. గురువారం శ్రావ్య గార్డెన్లో హిందూ సంప్రదాయ ప్రకారం వీరద్దరు ఏకమయ్యారు. వివాహానికి వరుడి తల్లి సిసిలియా, తండ్రి జాఫఫ్ హాజరయ్యారు. వీరు సైతం తెలుగు సంప్రదాయ దుస్తులు ధరించి వివాహ వేడుకలో పాల్గొన్నారు.
ఇబ్బందిపెట్టిన కరోనా..
అర్చన, శాన్ విన్ డ్యగ్ వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వరుడి తల్లిదండ్రులు ఇండియా రావడానికి విమానాశ్రయ వైద్య బృందం కరోనా వైరస్కు సంబంధించిన టెస్టులు చేయడం వలన ఇబ్బందులకు గురియ్యామని అందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 6న ఇండియాకు రావాల్సి ఉండగా, వీరు కరోనా టెస్టుల వల్ల 48 గంటలు ఆలస్యంగా 8న తేదీన శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నట్లు వరుడి తల్లిదండ్రులు తెలిపారు. వీరు తిరిగి ఈనెల 15న అమెరికా వెళ్లనున్నారు.
అమెరికా అబ్బాయి.. ఇందూరు అమ్మాయి
Published Fri, Mar 13 2020 8:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
కళతప్పిన జీవనదులు
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
ఢిల్లీ రేసులోకొచ్చింది!
గుట్టలుగా... అవినీతి కట్టలు
వేలంలో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి
రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
చెంచులతో మమేకమై.. ఓటు విలువ తెలిపి
జిల్లాకేంద్రంలో గాలి దుమారం
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement