పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం | mother suicide attempt with two childrens | Sakshi
Sakshi News home page

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం

Jul 15 2015 12:19 PM | Updated on Apr 4 2019 4:44 PM

నల్లగొండ జిల్లాలో విషాదం చోటుకుంది. ఇద్దరి పిల్లలతో సహా తల్లి విషం తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

సూర్యాపేట: నల్లగొండ జిల్లాలో విషాదం చోటుకుంది. ఇద్దరి పిల్లలతో సహా తల్లి విషం తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన బుధవారం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో జరిగింది. వివరాలు.. ఎస్. ఆత్మకూరు మండలం, రామన్నగూడెం గ్రామానికి చెందిన పిచ్చిరెడ్డి, అరుణ దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అరుణ తన ఇద్దరు పిల్లలు రోహిత్‌రెడ్డి(12), దివ్య(8)లతో కలిసి సూర్యాపేట పట్టణంలో నివాసముంటుంది.

అరుణ సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తూ పిల్లలను చదివిస్తోంది. కాగా, కుటుంబకలహాల నేపథ్యంలోనే బుధవారం ఉదయం తన ఇద్దరి పిల్లలకి విషమిచ్చి తనూ తీసుకుంది. స్తానికులు స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement