తల్లి,కొడుకు ఆత్మహత్యాయత్నం..
కుమారుడి మృతి.. తల్లి పరిస్థితి విషమం
May 28 2017 2:29 PM | Updated on Sep 2 2018 4:37 PM
విశాఖ: జిల్లాలోని అనకాపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన తల్లీ కుమారులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో కుమారుడు మృతిచెందగా.. తల్లి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. గత కొన్ని రోజులు కుటుంబ కలహాలతో సతమతమవుతున్న క్రమంలో తల్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయగా ఇది గుర్తించిన కుమారుడు ఉరి వేసుకొన్నాడు.
ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునే లోపే కుమారుడు మృతిచెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement