‘కాంగ్రెస్‌ ధర్నాలు గమ్మత్తుగా ఉన్నాయి’ | minister harish rao talks about congress Protests | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ ధర్నాలు గమ్మత్తుగా ఉన్నాయి’

Jul 18 2017 6:19 PM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ నాయకులు అనవసర విషయాలపై ధర్నాలకు దిగటం గమ్మత్తుగా ఉందని మంత్రి హరీష్‌రావు అన్నారు.

 
హుస్నాబాద్‌(కరీంనగర్‌): కాంగ్రెస్ నాయకులు అనవసర విషయాలపై ధర్నాలకు దిగటం గమ్మత్తుగా ఉందని మంత్రి హరీష్‌రావు అన్నారు. రైతులు గతంలో కాంగ్రెస్‌ పాలనలో ఎరువుల కోసం, నకిలీ విత్తనాలపైనా ధర్నాలు చేశారు. ఇప్పుడు అలాంటివేవీ లేనేలేవని, అయినా ఆందోళన చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మంత్రి కడియం శ్రీహరితో కలిసి హుస్నాబాద్‌లో ఐదువేల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంగల రెండు గోదాములను ప్రారంభించారు.

ఈ సందర‍్భంగా హరీష్‌రావు మాట్లాడారు.  హుస్నాబాద్ పట్టణంలో రైతు బజార్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ బస్ డిపోకు 25 బస్సులు కొద్దిరోజ్జుల్లోనే వస్తాయని తెలిపారు. హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ. కోటి మంజూరు చేస్తామని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గౌరవెల్లి, గండివెల్లి ప్రాజెక్టుల నిర్వాసితులకు ఎకరానికి రూ.8 లక్షల పరిహారం ఇస్తామంటున్నా కొందరు కాంగ్రెస్ నాయకులు కోర్టుకు  వెళ్లటం విడ్డురంగా ఉందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement