పట్టాలు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న రైలు | Man dies in train accident in secundrabad | Sakshi
Sakshi News home page

పట్టాలు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న రైలు

Apr 5 2015 7:58 PM | Updated on Sep 2 2017 11:54 PM

రైలు పట్టాలు దాటుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ రైల్వేపోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.

హైదరాబాద్: రైలు పట్టాలు దాటుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ రైల్వేపోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బొల్లారం, గుండ్ల పోచంపల్లి రైల్వేస్టేషన్ మధ్యలోని కోంపెల్లి వంతెన సమీపంలో ఓ వ్యక్తి (45) రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ రైలు ఢీ కొట్టడంతో అతడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కాగా, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement