కల్తీకల్లు తాగి ఒకరి మృతి | man died due to liquor in nallagonda distirict | Sakshi
Sakshi News home page

కల్తీకల్లు తాగి ఒకరి మృతి

Feb 25 2015 2:10 PM | Updated on Oct 16 2018 8:46 PM

నల్లగొండ జిల్లా భువనగిరి మండలంలో కల్తీ కల్లు తాగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

నల్లగొండ : నల్లగొండ జిల్లా భువనగిరి మండలంలో కల్తీ కల్లు తాగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. మండలంలోని బాలంపల్లిలో గ్రామానికి చెందిన కాశపాక మల్లేశ్(45)తో పాటు మరో నలుగురు మంగళవారం సాయంత్రం కల్లు తాగారు. అనంతరం వారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతే బుధవారం ఉదయం మల్లేశ్ మృతి చెందాడు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.
(భువనగిరి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement