కరెంట్ షాక్‌తో యువకుడి మృతి | man died due to current shock | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

Sep 11 2015 11:57 AM | Updated on Sep 28 2018 3:41 PM

రంగారెడ్డి జల్లా వికారాబాద్ మండలం ఆలంపల్లిలో కరెంట్ షాక్‌తో అల్లాడ బుచ్చిరెడ్డి(25)అనే యువకుడు మరణించాడు.

వికారాబాద్: రంగారెడ్డి జల్లా వికారాబాద్ మండలం ఆలంపల్లిలో కరెంట్ షాక్‌తో అల్లాడ బుచ్చిరెడ్డి(25)అనే యువకుడు మరణించాడు. వివరాలు.. ఆలంపల్లి పక్కనే ఉన్న కొత్తగడి గ్రామానికి చెందిన అల్లాడ బుచ్చిరెడ్డి తండ్రి లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో కరెంటు పనికి బుచ్చిరెడ్డి వెళ్లాడు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద జంపర్ కొట్టడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తూ  షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement