‘కేటీఆర్‌.. ట్విట్టర్‌లో ఇప్పుడు స్పందించవా?’

Komati Reddy Venkata Reddy Fires On KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఓట్ల కోసం శిలా ఫలకం ప్రారంభించిన కేటీఆర్‌ ఇంతవరకూ రోడ్డు వేయలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 4 వేల కోట్లకు పైగా దొంగ జీవోలు చేసినా ఎక్కడా పనులు చేపట్టలేదని విమర్శించారు. తట్టి అన్నారంలోని ఇందు అరణ్య అపార్ట్‌మెంట్‌ నుంచి ఎంపీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన వెంకటరెడ్డి ఎన్నికల్లో గెలిచాక మళ్లీ వస్తాననీ కార్యకర్తలకు మాట ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా తట్టి అన్నారం క్రాస్‌ రోడ్ నుంచి పెద్ద అంబర్‌పేట్‌ వరకు రోడ్డు నిర్మాణం కోసం కేటీఆర్‌ ప్రారంభించిన శిలాఫలకాన్ని పరిశీలించారు. ‘ప్రతి దానికి ట్విట్టర్‌లో స్పందించే కేటీఆర్ ఈ అంశంపై స్పందించాలి. తట్టి అన్నారం, పెద్ద అంబర్ పెట్ క్రాస్‌ రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి. లేని పక్షంలో ఓట్ల కోసమే శిలాఫలకం ప్రారంభించానని తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్పాలి’ అని ఎంపీ అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top