'సొంత జిల్లాలో చర్చిని కేసీఆర్ పట్టించుకోవట్లేదు' | KCR careless on medak church, says mandakrishna | Sakshi
Sakshi News home page

'సొంత జిల్లాలో చర్చిని కేసీఆర్ పట్టించుకోవట్లేదు'

Jul 5 2015 8:28 PM | Updated on Oct 8 2018 3:00 PM

'సొంత జిల్లాలో చర్చిని కేసీఆర్ పట్టించుకోవట్లేదు' - Sakshi

'సొంత జిల్లాలో చర్చిని కేసీఆర్ పట్టించుకోవట్లేదు'

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు క్రైస్తవులను చిన్నచూపు చూస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

మెదక్ రూరల్/రామాయంపేట: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు క్రైస్తవులను చిన్నచూపు చూస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆయన మెదక్‌లోని చర్చిగేటు వద్ద ఆదివారం ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హిందు దేవాలయాలకు సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నారని ఆరోపించారు.

కానీ, ఆయన సొంత జిల్లాలోని మెదక్ చర్చిని మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మెదక్ చర్చికి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారని, అలాంటి చర్చికి వెంటనే రూ.100 కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement