‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రాష్ట్రానికి విద్యుత్ భారం’ | Jeevan Reddy Slams On TRS Government In Jagtial | Sakshi
Sakshi News home page

‘పబ్లిసిటీ మీద ఉన్న చిత్తశుద్ధి నిర్మాణ పనుల మీద లేదు’

Sep 21 2019 6:22 PM | Updated on Sep 21 2019 6:41 PM

Jeevan Reddy Slams On TRS Government In Jagtial - Sakshi

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, జగిత్యాల: యాభై రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఇంతవరకు ఒక్క బొట్టు కూడా వినియోగంలోకి రాలేదని మండిపడ్డారు. రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తి పోసే ప్రాజెక్టు కలిగి ఉండటంతో సుమారు వంద టీఎంసీల నీరు వృధాగా పోతుందన్నారు. ఇప్పటి వరకు కేవలం 16 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రాష్ట్రానికి విద్యుత్ భారం అవుతుందన్నారు. రొల్లవాగు ఆధునీకరణకు టెండర్ ప్రక్రియ చేపట్టి మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు పనులు ప్రారంభించలేదన్నారు. పబ్లిసిటీ మీద ఉన్న చిత్తశుద్ధి ప్రాజెక్టు నిర్మాణ పనుల మీద లేదని జీవన్‌రెడ్డి దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement