తండ్రి మందలించాడని ఇల్లు వదిలిన కొడుకు | intermediate student missing | Sakshi
Sakshi News home page

తండ్రి మందలించాడని ఇల్లు వదిలిన కొడుకు

Apr 28 2015 3:33 PM | Updated on Mar 28 2018 11:08 AM

ఇంటర్ పరీక్ష ఫెయిలైనందుకు తండ్రి మందలించడంతో కొడుకు ఇల్లొదిలి వెళ్లిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ఆర్‌బీనగర్ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది.

రంగారెడ్డి : ఇంటర్ పరీక్ష ఫెయిలైనందుకు తండ్రి మందలించడంతో కొడుకు ఇల్లొదిలి వెళ్లిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ఆర్‌బీనగర్ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఆర్‌బీనగర్ కాలనీకి చెందిన అరవింద్‌రెడ్డి(17) అనే యువకుడు నగరంలోని అత్తాపూర్ శ్రీమేథా జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

 

సోమవారం విడుదలైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కొడుకు ఫెయిల్ అయ్యాడని తెలియడంతో తండ్రి... 'ఇంత ఖర్చు పెట్టి చదివించినా నువ్వు కనీసం పాస్ కాలేదు' అని తిట్టడంతో అరవింద్ రెడ్డి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. ఇంటికి ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు స్నేహితుల ఇళ్లలో వాకబు చేసినా ఎలాంటి లాభం లేకపోయింది. దీంతో తమ కొడుకును వెతికి పెట్టాల్సిందిగా మంగళవారం ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement