భార్యను అప్పగించాలని భర్త ఆందోళన | Husband Protest For Wife Infront of Police Station | Sakshi
Sakshi News home page

భార్యను అప్పగించాలని భర్త ఆందోళన

Apr 18 2018 1:46 PM | Updated on Apr 18 2018 1:46 PM

Husband Protest For Wife Infront of Police Station - Sakshi

కుమారులతో ఆందోళన చేస్తున్న రవి

రాయపర్తి: తన భార్యను ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని ఓ వ్యక్తి మంగళవారం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన చేశాడు. బాధితుడు మూనావత్‌ రవి  కథనం ప్రకారం.. మండలంలోని సూర్యతండాకు చెందిన పంతులునాయక్‌ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి 20 రోజుల క్రితం తన భార్యను తీసుకెళ్లాడని తెలిపాడు.

ఈ విషయమై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపించాడు. దీంతో పిల్లలు హరిప్రసాద్, రాంప్రసాద్‌ను తీసుకొచ్చి పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేసినట్లు చెప్పాడు. పంతులునాయక్‌పై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనలో తండా మహిళలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement