హత్య కేసులో మనవడే నిందితుడు | grandson is accused of his grandfather murder | Sakshi
Sakshi News home page

హత్య కేసులో మనవడే నిందితుడు

Apr 19 2015 12:49 AM | Updated on Mar 28 2018 11:08 AM

ఈనెల 16న పరిగి మండలం గడిసింగాపూర్ రెవెన్యూ పరిధిలో వెలుగుచూసిన రామచంద్రయ్య(70) అనే వృద్ధుడి హత్య కేసును పరిగి పోలీసులు రెండురోజుల్లో ఛేదించారు.

రంగారెడ్డి(పరిగి): ఈనెల 16న పరిగి మండలం గడిసింగాపూర్ రెవెన్యూ పరిధిలో వెలుగుచూసిన రామచంద్రయ్య(70) అనే వృద్ధుడి హత్య కేసును పరిగి పోలీసులు రెండురోజుల్లో ఛేదించారు. సొంత మనవడే తన తాతను హత్యచేశాడని పోలీసులు బట్టబయలు చేశారు. రాంచంద్రయ్యను హత్య చేసే అవసరం ఎవరికుందనే కోణంలో ఆరాతీశారు.

ఇటీవల పలుసార్లు ఆయన తన మనవడు ఆంజనేయులతో గొడవపడ్డాడని తెలుసుకున్నారు. దీంతో ఆంజనేయులును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరుపగా హత్యానేరం అంగీకరించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి శనివారం రిమాండుకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement