తండ్రి చేతిలో తనయుడి హతం | Father, son killed at the hands of | Sakshi
Sakshi News home page

తండ్రి చేతిలో తనయుడి హతం

Oct 6 2014 3:38 AM | Updated on Sep 2 2018 4:37 PM

తండ్రి చేతిలో తనయుడి హతం - Sakshi

తండ్రి చేతిలో తనయుడి హతం

బాలానగర్ : ఆలనాపాలన పంచిన తండ్రే క్షణికావేశంలో తన కొడుకు ప్రాణం తీశాడు. గొడవపడ్డ కొడుకులను వారించే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థాని కుల కథనం మేరకు..

బాలానగర్ : ఆలనాపాలన పంచిన తండ్రే క్షణికావేశంలో తన కొడుకు ప్రాణం తీశాడు. గొడవపడ్డ కొడుకులను వారించే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థాని కుల కథనం మేరకు.. బాలానగర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నందిగామకు చెందిన పాల్‌కొండ ముత్యాలుకు కుమారులు నర్సింలు (36), చెన్నయ్య, రాజు ఉన్నారు. వృత్తిరీత్యా వ్యవసాయదారులు. సుమారు ఎనిమిదేళ్లక్రితం తమకున్న పొలాన్ని అమ్ముకుని ధన్వాడ మండలం రాకొండకు వెళ్లారు. ఏడాదిక్రితం అక్కడి నుంచి తిరిగి స్వగ్రామానికి వచ్చి నూతనంగా ఇల్లు నిర్మిం చుకుని అందరూ ఉమ్మడిగా అందులోనే ఉంటున్నారు. శని వారం రాత్రి నర్సింలు మద్యంతాగి ఇంటికి రాగా తమ్ముళ్లు గొడవపడ్డారు.

ఈ క్రమంలోనే తండ్రి కర్రతో తీవ్రంగా కొట్టడంతో పెద్ద కుమారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం ఉదయం వరకు దీనిని గోప్యంగా ఉంచి ఇంటిపై నుంచి పడిపోయి మృతి చెందాడని గ్రామస్తులకు నమ్మబలికారు. గ్రామస్తులు నిలదీయగా అసలు విషయం చెప్పారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ మనోజ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించా రు. ఈ మేరకు ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నర్సింలుకు మొదటి భార్య గతంలోనే మృతి చెందింది. రెండో భార్య ఇటీవల విడాకులు తీసుకుని పుట్టింటికి వెళ్లింది. మొదటి భార్యకు కూతురు స్వప్న ఉంది.  గతంలోనే తల్లి మృతి చెందగా ఇప్పుడు తండ్రి హత్యకు గురికావడంతో ఆ బాలిక దిక్కులేనిదైంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement