సీఎం దిష్టిబొమ్మ దహనం


సిరికొండ మండలకేంద్రంలో గురువారం ఆశాకార్యకర్తలు తెలంగాణ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. తమ జీతాలు పెంచాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కొన్ని రోజులుగాసమ్మె చేస్తున్న సంగతి తెల్సిందే. సమ్మెలో భాగంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో ఆశాకార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలు చేశారు.




 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top