సీఐ భార్య అనుమానాస్పద మృతి | CI's wife suspicious death at warangal | Sakshi
Sakshi News home page

సీఐ భార్య అనుమానాస్పద మృతి

Apr 4 2016 12:59 PM | Updated on Sep 3 2017 9:12 PM

సీఐ భార్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

 సీఐ భార్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. వరంగల్ జిల్లా జనగామ పట్టణ సీఐ మసికే శ్రీనివాస్ భార్య మసికే ఆశాజ్యోతి(29) ఆదివారం అర్ధరాత్రి మృతిచెందింది. . గత రెండు రోజులుగా శ్రీనివాస్ కొమురవెళ్లి జాతర బందోబస్తు డ్యూటీలో ఉండగా.. క్వార్టర్స్‌లో తన ఆరేళ్ల కొడుకుతో ఉంటున్న ఆశాజ్యోతి అనుమానాస్పద స్థితిలో మృతిగా పోలీసులు గుర్తించారు. 

వీరిది ప్రేమవివాహం కాగా.. ఆమెకు ఫిట్స్ వ్యాధి ఉందని దాని ప్రభావంతోనే ఆమె మృతిచెంది ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. మృతురాలి సోదరుడు రంజిత్‌కుమార్ మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement