'కేసీఆర్కు అధికారం ఇచ్చింది ఐదేళ్లు మాత్రమే' | bhatti vikramarka fires on KCR government | Sakshi
Sakshi News home page

'కేసీఆర్కు అధికారం ఇచ్చింది ఐదేళ్లు మాత్రమే'

Apr 24 2015 3:26 PM | Updated on Mar 18 2019 7:55 PM

'కేసీఆర్కు అధికారం ఇచ్చింది ఐదేళ్లు మాత్రమే' - Sakshi

'కేసీఆర్కు అధికారం ఇచ్చింది ఐదేళ్లు మాత్రమే'

తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కె. చంద్రశేఖర్ రావుకు కేవలం ఐదేళ్లు మాత్రమే అధికారం ఇచ్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కె. చంద్రశేఖర్ రావుకు కేవలం ఐదేళ్లు మాత్రమే అధికారం ఇచ్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. తన వల్లే తెలంగాణ వచ్చిందంటూ కేసీఆర్ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కాంగ్రెస్పై పరోక్షంగా కేసీఆర్ పలు విమర్శలు చేశారు. దీనికి నిరసనగా భట్టి విక్రమార్క శుక్రవారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ..దళితులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందని విమర్శించారు.


తెలంగాణ ప్రజలు కేసీఆర్కు పట్టం కట్టింది కేవలం ఐదేళ్లు పాలించటానికి మాత్రమేనని చెప్పారు. అంతే కాకుండా టీఆర్ఎస్ పార్టీ మాదిరిగా ఎప్పుడూ మోసపూరిత హామీలివ్వడం కాంగ్రెస్ చరిత్రలో లేదని భట్టి సమర్థించుకున్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ ఇంటర్నెట్ న్యూట్రాలిటీని కొనసాగించాల్సిందేనని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేందుకే ఇంటర్నెట్ న్యూట్రాలిటీకి తూట్లు పొడుస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement