స్కూల్ వ్యాను కిందపడి చిన్నారి మృతి | 2 years old girl killed in road accident | Sakshi
Sakshi News home page

స్కూల్ వ్యాను కిందపడి చిన్నారి మృతి

Jun 18 2016 11:08 AM | Updated on Sep 4 2017 2:49 AM

మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని రైతు కాలనీ వద్ద శనివారం స్కూల్ బస్సుకిందపడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది.

షాద్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని రైతు కాలనీ వద్ద శనివారం స్కూల్ బస్సుకిందపడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. కాకతీయ స్కూల్‌కు చెందిన బస్సు పిల్లలను ఎక్కించుకునేందుకు రైతు కాలనీలో ఆగింది. అదే సమయంలో స్థానికులురాలు మానస కుమార్తె నందిని(2) ఆడుకుంటూ ఆగి ఉన్న బస్సు కిందికి వెళ్లి పోయింది. బస్సుకింద చిన్నారి ఉన్న విషయం గమనించని డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దాంతో ఆ చిన్నారి బస్సు చక్రాలకింద నలిగిపోయి మృతి చెందింది. చిన్నారి మృతితో కాలనీలో విషాదం నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement