-
ప్రక్షాళన మొదలు.. ఆ నేతలకు మీనాక్షి నటరాజన్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు విమర్శించుకోవద్దని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. ఆమె నేటి నుంచి రాష్ట్రంలో పార్టీ పనితీరుపై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చేపట్టారు. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అధ్యక్షతన మెదక్ లోక్సభ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. పార్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడితే వేటు తప్పదంటూ మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు.పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటున్నానని చెప్పిన మీనాక్షి.. నియోజకవర్గ ఇంఛార్జ్లు బాధ్యతతో పనిచేయాలన్నారు. ఇంఛార్జ్ వల్లే సమస్యలు వస్తే.. పదవి నుంచి తొలగిస్తామంటూ ఆమె ఖరాఖండిగా చెప్పేశారు. పటాన్ చెరువులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారన్న కాట శ్రీనివాస్ గౌడ్.. సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసినా.. ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదంటూ ఫిర్యాదు చేశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలంటూ ఇంఛార్జ్ని కాట కోరారు.అధికారులు తమ మాట వినడం లేదన్న మరి కొందరు నేతలు.. ఇంకా బీఆర్ఎస్ నేతలే అధికారం చెలాయిస్తాన్నారంటూ మరికొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇందిరమ్మ ఇల్లు అయినా తాము చెప్పిన వారికి ఇస్తే గౌరవం ఉంటుందంటూ మీనాక్షి నటరాజన్కు పలువురు నేతలు చెప్పారు. -
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: పదకొండు రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించామని.. త్వరలోనే అన్ని రాష్ట్రాలకు ప్రకటిస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. మరో వారం, పది రోజుల్లో మన రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పూర్తవుతుందన్నారు. దక్షిణాది వ్యక్తికి జాతీయ అధ్యక్ష పదవి అని ఎక్కడా చర్చ లేదని ఆయన పేర్కొన్నారు.‘‘డీపీఆర్ సర్వే సక్రమంగా చేయకపోతే ట్రిపుల్ ఆర్ వెనక్కి వెళ్తుంది. బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తే ఎట్లా?. బీసీల్లో పది శాతం ముస్లింలను కలపకపోతే ఆమోదిస్తాం. కుల గణన తప్పుల తడకగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. జన గణన చేసిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ ఖరారు చేస్తారు. దక్షిణాదిలో ఒక్క పార్లమెంటు సీటు తగ్గదని ప్రధాని చెప్పారు. 2011తో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. జనాభా తగ్గినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు తగ్గవు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో 153 అసెంబ్లీ సీట్లు తెలంగాణాలో పెంచుకోవచ్చని పొందుపరిచారు’’ అని లక్ష్మణ్ చెప్పారు. -
‘ఆదిలాబాద్ ఆయువుపట్టును అమ్మేసే కుట్ర’
హైదరాబాద్: ఆదిలాబాద్ కు ఆయువుపట్టు సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అని, దానిని తుక్కుగా అమ్మే కుట్ర బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని, ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని తుక్కు ఫ్యాక్టరీగా చూస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తలుచుకుంటే ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ తెరుచుకోదా? అని ప్రశ్నించారు కేటీఆర్. సిర్పూర్ పేపర్ మిల్లును కేసీఆర్ తెరిపించి నడిపిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రయోజనాలంటే బీజేపీకి పట్టింపులేదన్నారు కేటీఆర్ సీసీఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి, ఓట్లు దండుకున్న బీజేపీ, ఇప్పుడు ఆ సంస్థను స్క్రాప్ కింద అమ్మాలనుకోవడం ప్రజలను వంచించడమేనన్నారు. బీజేపీ అంటే నమ్మకం కాదు.. అమ్మకం అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. కేంద్ర మంత్రులు అమిత్ షాతో సహా ప్రతీ ఒక్కరూ ఎన్నికల్లో లబ్ధికోసం సీసీఐ తెరుస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు అప్పనంగా అమ్మడానికి సిద్ధమయ్యారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, అప్పటివరకూ కార్మికులతో కలిసి ఉద్యమిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. సంస్థ పరిరక్షణ కోసం ఎంతవరకూ అయినా పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. -
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. ప్రభుత్వానికి,ఈసీకి.. సుప్రీం నోటీసులు
సాక్షి, ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరిగింది. బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపుల అంశంపై మార్చి 22 లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 25 కి వాయిదా వేసింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైమ్ అంటే ఎంతో చెప్పాలని ప్రశ్నించింది. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా ?. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి. ఎంత సమయం కావాలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదు’అని బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది అర్యమ సుందరం తన వాదనలు వినిపించారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడమంటే రాజ్యంగమిచ్చిన విధులను నిర్వహించడంలో విఫలమైనట్లేనని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసింది. గత విచారణలోగత విచారణ సందర్బంగా అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్ టైమ్ అంటే ఎంతో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బీఆర్ఎస్ వాదనలు వినిపించింది. ఈ నేపథ్యంలో రీజనబుల్ టైం ఎంతో చెప్పాలంటూ కోర్టు తెలంగాణ స్పీకర్ను ప్రశ్నించింది.ఇక, తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలు తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇటీవలే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం బాలరాజు సహా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు.మరోవైపు.. గత వాదనల్లో.. తెలంగాణ స్పీకర్ (Telangana Speaker) తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తగిన సమయం.. సరైన సమయం.. అంటూ స్పీకర్ చెబుతూ కాలయాపన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేదాకా ఆగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై పూర్తి వాదనలు విన్నాకే ‘ఆ సరైన సమయం’పై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే స్పీకర్కు సూచనలు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనుందా అనే ఆసక్తి నెలకొంది.ఇంతకు ముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. -
తెలంగాణ: కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్లో ఇప్పటివరకు 2లక్షల 10వేల ఓట్లను విభజించారు. వీటిలో సుమారు 21వేల ఓట్లు చెల్లుబాటు కాలేదని అధికారులు తెలిపారు.కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుమారు ఒక లక్ష 89 వేల ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇంకా 40వేల ఓట్లు విభజన చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుండి మొదటి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేసే అవకాశం ఉంది. -
ఎమ్మెల్సీ గెలుపు.. రాబోయేది బీజేపీ కాలమే: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించి చరిత్ర సృష్టించారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీపై నమ్మకానికి ఇది నిదర్శనం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.తెలంగాణలోని కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ నుంచి బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్క కొమురయ్య జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ చేసిన పోరాటాన్ని ఉపాధ్యాయులు గుర్తించారు. ఉపాధ్యాయులందరికీ వందనం. ఈ విజయాన్ని ప్రధాని మోదీ, ఉపాధ్యాయులకి అంకితం చేస్తున్నాం. బీజేపీని విమర్శించిన వారికి ఇదొక గుణపాఠం.కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిపోయి.. బీజేపీని ఓడించాలని చూశారు. ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ ఒక వర్గానికి కొమ్ము కాసింది. నితీకి నిజాయితీకి నిదర్శనం ఈ విజయం. రాబోయేది బీజేపీ కాలమే. తెలంగాణలో రామరాజ్యం, మోదీ రాజ్యం రానుందని చెప్పేందుకు ఇదే నిదర్శనం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి నేతృత్వంలో పార్టీకి ఇది మూడో విజయం. కిషన్రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాం. తెలంగాణలో టీచర్లు అందరూ తపస్లో చేరాలి అని సూచించారు. -
బీజేపీ, పీఆర్టీయూకు చెరొకటి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/నల్లగొండ: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో ఒకటి బీజేపీ కైవసం చేసుకోగా, మరొకటి పీఆర్టీయూ సొంతం చేసుకుంది. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. కరీంనగర్–మెదక్– నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల వడబోత కార్యక్రమం సోమవారం సాయంత్రం మొదలుకాగా, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓట్ల వడబోత పూర్తయ్యాక, కట్టలు కట్టి, మంగళవారం మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానంలో....వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో శ్రీపాల్రెడ్డి విజయం సాధించారు. శ్రీపాల్రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,848 ఓట్లు వచ్చాయి. శ్రీపాల్రెడ్డి గెలిచినట్టుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం రాత్రి ప్రకటించారు. మొదటి నుంచీ ఆధిక్యంలోనే... పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్రెడ్డి మొదటి నుంచీ ఆధిక్యంలోనే కొనసాగారు. నల్లగొండలోని ఆర్జాలబావిలో ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లోని స్ట్రాంగ్ రూమ్లో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ల నుంచి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి కౌంటింగ్ హాలులో 25 టేబుళ్లపై మొదట కట్టలు కట్టే ప్రక్రియ చేపట్టి 11 గంటల వరకు పూర్తి చేశారు. అనంతరం కౌంటింగ్ ప్రారంభించారు. సాయంత్రం 3 గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్యతలో శ్రీపాల్రెడ్డి అత్యధికంగా ఓట్లు సాధించారు. ఆయనకు 6,035 ఓట్లు లభించగా, ద్వితీయస్థానంలో 4,820 ఓట్లతో అలుగుబెల్లి నర్సిరెడ్డి నిలవగా, మూడో స్థానంలో 4,437 ఓట్లు పొంది గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి నిలిచారు. ఆ తర్వాత పూల రవీందర్ 3,115 ఓట్లతో నాలుగో స్థానంలో, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి 2,289 ఓట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచారు. సుందర్రాజ్ యాదవ్ 2,040 ఓట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. మిగిలిన అభ్యర్థుల్లో ఒక్కరు మినహా మిగిలిన వారంతా 500 లోపు ఓట్లు వచ్చినవారే ఉన్నారు. రౌండ్ రౌండ్కూ పెరిగిన ఆధిక్యం ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25,797 మంది ఓటర్లు ఉండగా, 24,135 ఓట్లు పోలయ్యాయి. అందులో 499 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. అయితే చెల్లిన ఓట్లలో సగానికి ఒకటి ఎక్కువగా పరిగణనలోకి తీసుకొని 11,821 ఓట్లు గెలుపు కోటాగా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత కోటా ఓట్లు ఎవరికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అలా 14 మందిని ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించడంతో శ్రీపాల్రెడ్డికి 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు, హర్షవర్ధన్రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్కు 3,249 ఓట్లు, సరోత్తంరెడ్డికి 2,394 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత తక్కువగా ఓట్లున్న సుందర్రాజును ఎలిమినేట్ చేసి 15వ రౌండ్ ఓట్లు లెక్కించారు. ఇందులో శ్రీపాల్రెడ్డి ఓట్లు 6,916కు పెరిగాయి. ఆ తర్వాత బీజేపీ అభ్యర్ధి సరోత్తంరెడ్డిని ఎలిమినేట్ చేసి 16వ రౌండ్లో ఓట్లు లెక్కించారు. ఇందులో శ్రీపాల్రెడ్డి ఓట్లు 7,673కు చేరుకున్నాయి. ఆ తర్వాత పూల రవీందర్ను ఎలిమినేట్ చేసి 17వ రౌండ్ ఓట్లు లెక్కించగా, శ్రీపాల్రెడ్డి 9,021 ఓట్లకు చేరుకున్నారు. ఆ తర్వాత మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్రెడ్డిని ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. ఇందులో శ్రీపాల్రెడ్డికి 11,099 ఓట్లు లభించగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు లభించాయి. నర్సిరెడ్డికి వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలోని రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించి.. శ్రీపాల్రెడ్డి గెలిచినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ప్రకటించారు. కరీంనగర్లో కమల వికాసం కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని ముందు నుంచీ ఊహించినట్టుగానే బీజేపీ కైవసం చేసుకుంది. ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమైనా.. అధికారులు జాప్యం చేయడం వల్ల ఓట్ల వడబోత తీవ్ర ఆలస్యమైంది. దీంతో సాయంత్రం 7 గంటలు దాటాక టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. రాత్రి 9.30 గంటలకు ఫలితం తేలింది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 27,088 ఓట్లకుగాను.. 25,041 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 24,144 ఓట్లు చెల్లుబాలు అయ్యాయి. 897 ఓట్లు చెల్లలేదని అధికారులు ప్రకటించారు. గెలుపు కోటాగా 12,073 ఓట్లను నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు, వంగ మహేందర్రెడ్డికి 7,182, అశోక్కుమార్కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. తొలిరౌండ్లోనే బీజేపీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు. రాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. అధికారుల లెక్కల్లో గందరగోళం.. టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం పోలైన ఓట్లలో మూడు రకాల గణాంకాలతో అధికారులు గందరగోళానికి తెరతీశారు. పోలింగ్ రోజు రాత్రి 24,895 ఓట్లు వచ్చాయని, మరునాడు శుక్రవారం 24,968 మంది ఓటేశారని, తాజాగా సోమవారం మొత్తంగా 25,041 ఓట్లు పోలయ్యాయని వెల్లడించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఓట్ల వడబోత కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించి కౌంటింగ్లో ఓట్ల వడబోత ఇంకా కొనసాగుతోంది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గపరిధిలో 3.55 లక్షలకు 2,50,106 ఓట్లు పోలయ్యాయి. అందులో ముందుగా లక్ష ఓట్లను వడబోశారు. అందులో 92,000 ఓట్లు చెల్లుబాటు కాగా, 8,000 చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. ఇంకా 1.5 లక్షల ఓట్లు వడబోయాల్సి ఉంది. గ్రాడ్యుయేట్ ఓటర్ల బ్యాలెట్లు కట్టలు కట్టే ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం వరకు సాగుతుందని, ఆ తర్వాతే ఓట్ల లెక్కింపు ఉంటుందని పేరు తెలిపేందుకు ఇష్టపడట్లో అధికారి సాక్షికి తెలిపారు. భారీగా ఇన్వాలీడ్ ఓట్లు.. ఆర్వోపై ఈసీకి ఫిర్యాదు గ్రాడ్యుయేట్కు సంబంధించి భారీగా ఇన్వాలీడ్ ఓట్లు నమోదయ్యాయని సమాచారం. దాదాపు 50 వేల ఓట్లు చెల్లకుండా పోయాయని ప్రచారం జరిగినా.. సాయంత్రానికి అధికారులు దానిని ఖండించారు. ఓటర్లు చిన్న చిన్న తప్పులతో తమ విలువైన ఓటును చెల్లకుండా చేసుకున్నారు. ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో అంకెలకు ముందు సున్నా రాయడం, ఆ అంకెకు సున్నా చుట్టడం, అంకె వేసినాక సంతకం చేయడం, దానికి ఎదురుగా టిక్ గుర్తు పెట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం తదితర తప్పిదాల వల్ల భారీగా ఓట్లు చెల్లకుండా పోయాయని కాంగ్రెస్ అభ్యర్థి నరేంందర్ రెడ్డి, ఏఐఎఫ్బీ అభ్యర్ధి, మాజీ మేయర్ రవీందర్ సింగ్లు వాపోయారు. అదే సమయంలో తమకు ఓటేసిన వారిలో అంకె ముందు సున్నా పెట్టిన వారి ఓట్లను ఇన్వాలీడ్ కాకుండా గుర్తించాలని ఆర్వోకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. అదే విధంగా రవీందర్సింగ్ ఓట్లు లెక్కించే సమయంలో జంబ్లింగ్ విధానం పాటించలేదని ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. అంతేకాకుండా పలు బూత్ల ఓట్ల విషయంలో గోప్యత పాటించకుండా బయటకు వెల్లడించేలా సిబ్బంది వ్యవహరించారని ఆరోపిస్తూ.. ఆర్వో మీద ఈసీకి ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తానని రవీందర్సింగ్ చెప్పారు. కొత్త ఓటర్లకు ఓటేసే విధానంపై అవగాహన కల్పించడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమో’
నల్లగొండ జిల్లా : వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసిన యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఓటమి పాలయ్యారు. అంతకుముందు ఎమ్మెల్సీ గా ఉన్న ఆయన.. ఈసారి ఓటమి పాలయ్యారు. నర్సిరెడ్డిపై పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు.ఓటమి అనంతరం నర్సిరెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘ ఈ ఓటమి నన్ను బాధించటం లేదు. గెలుపు ఓటములు సహజం. ఓటమిని అంగీకరిస్తున్నా. గెలిచిన అభ్యర్థి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని సూచిస్తున్నాను. ఉపాధ్యాయులు రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమో. ప్రచారం ఉధృతంగా చేసినా నేను ఎందుకు ఓడిపోయానో ఉపాధ్యాయులకు తెలుసు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు’ అని తెలిపారు.ఇది ఉపాధ్యాయుల విజయంఇక నర్సిరెడ్డిపై విజయం సాధించిన పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి సైతం అదే కౌంటింగ్ కేంద్ర వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పు విలువైనది. . ఉపాధ్యాయుల విజయం మండలి సభ్యుడిగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తా. విద్యారంగాన్ని పటిష్టం చేసేలా అవసరం అయితే ఉద్యమాలు సైతం చేస్తా. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తాను. ఉన్నత విద్య అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చేస్తాను. నా గెలుపు ముందుగా ఊహించిందే’ అని పేర్కొన్నారు పింగళి శ్రీపాల్ రెడ్డి. -
‘నాలుగు నెలలు నిద్రపోయి.. ఇప్పుడు పిట్ట కథలా?’
హైదరాబాద్: త్వరలో తెలంగాణ సీఎం మారడం ఖాయమంటూ మాట్లాడిన బీజేఎల్సీ నేత మహేశ్వర్ రెడ్డిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. నాలుగైదు నెలలపాటు నిద్రపోయి.. ఇప్పుడు మళ్లీ మీడియా ముందు పిట్టకథలు చెబుతున్నాడని ధ్వజమెత్తారు ఆది శ్రీనివాస్. ‘సినిమా స్క్రిప్ట్ తయారు చేసుకుని చిట్ చాట్ ల పేరుతో చెత్త వాగుడు వాగుతున్నాడు. డిసెంబర్ లో ముఖ్యమంత్రి మారుతాడని, మీనాక్షి నటరాజన్ అందుకోసమే వచ్చారని కట్టు కథలు చెపుతున్నాడు. మహేశ్వర్ రెడ్డి పరిస్థితి గురివింద గింజలా ఉంది. తన కింద ఉన్న నలుపు ను ఆయన చూడలేకపోతున్నాడు. సొంత పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య ఉన్న అసంతృప్తులు ఆయనకు కనిపించడం లేదు. గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల్లో రాజాసింగ్ అసలు మీ పార్టీ ఆఫీసు వైపు కూడా రావడం లేదు. నా పైన కుట్ర చేస్తున్నారని, పార్టీ నుంచి వెళ్లిపోమ్మంటే పోతానని ఆయన బహిరంగంగానే చెపుతున్నారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి మోహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఇక మీ ఎంపీలు ఎవరి దుకాణం వాళ్లే పెట్టుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం కొట్టుకు చస్తున్నారు.. ఈటెల రాజేందర్ ది ఒక దారి, రఘనందన్ రావు ది మరో దారి, ఇక ధర్మపురి అర్వింద్ ఎటో తెలియనే తెలియదు...బండి సంజయ్ ఏం మాట్లాడుతాడో తెలియదు. నీ పార్టీలో ఇన్ని లొసుగులు పెట్టుకుని నువ్వు మా ముఖ్యమంత్రి గురించి, మంత్రుల గురించి మాట్లాడుతవా..? , మహేశ్వర్ రెడ్డి... నువ్వు చిలుక జోస్యం ఆపకపోతే నీ భవిష్యత్తు గురించి మేం చెప్పాల్సి వస్తుంది జాగ్రత్త.. సీఎం రేవంత్ రెడ్డి 18 గంటలు కష్టపడుతు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.బీఆర్ఎస్ అప్పనంగా రాష్ట్రాన్ని దోచుకున్నా బీజేపీ పట్టించుకోలేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురాకుండా విమర్శలు చేస్తారా. ప్రభుత్వం పైన ఓర్వ లేక ఈర్ష తో ప్రభుత్వంపైన మాట్లాడుతున్నారు. గోతికాడ నక్కలా బీఆర్ఎస్ తరహాలో బీజేపీ వ్యవహరిస్తోంది. ’ అంటూ విమర్శించారు ఆది శ్రీనివాస్. -
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు.. ఆశ్చర్యంలో మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి,హైదరాబాద్ : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో గందరగోళం నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కౌంటింగ్లో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 2లక్షల 50వేల ఓట్లు పోలైతే దాదాపు 40వేల ఓట్లు పైచిలుకు చెల్లనివి కావడంతో అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు.ఈ క్రమంలో కౌంటింగ్ ప్రక్రియపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆరా తీశారు. చెల్లని ఓట్లు వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. చదువుకున్నవాళ్లకు ఓట్లు ఎలా వేయాలో తెలియకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. చెల్లని ఓట్లపై ఏర్పడ్డ గందరగోళంపై అభ్యర్థుల ఆందోళన బాటపట్టారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. -
‘ఆమెకు ఇచ్చిన టాస్క్ ఒక్కటే.. సీఎం చేంజ్ ఆపరేషన్’
హైదరాబాద్: తెలంగాణలో నాలుగు స్తంభాలాటగా మంత్రి వర్గం నడుస్తోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ క్యాబినెట్ లో కలహాలు, కథలు కథులుగా నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ ఆగస్టు వరకూ తెలంగాణలో సీఎం మార్పు తథ్యమని మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. అందులో భాగంగానే కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వచ్చారన్నారు. ఆమెకు రాహుల్ గాంధీ అప్పగించిన టాస్క్ ఒక్కటే.. సీఎం ఛేంజ్ ఆపరేషన్ అంటూ చమత్కరించారు.‘తెలంగాణ ఆడపిల్లల ఆశీర్వాదం కాదు.. ఢిల్లీ నుంచి వచ్చిన మీనాక్షి నటరాజన్ ఆశీర్వాదం ఉంటేనే రేవంత్ సీఎంగా కొనసాగుతారు. రాహుల్ గాంధీ సొంత టీం నుంచి మీనాక్షి నటరాజన్ ను ‘మిషన్ సీఎం ఛేంజ్ ఆపరేషన్’ కోసం పంపించారు. మంత్రులు.. సీఎంను లెక్క చేయడం లేదని స్వయంగా రేవంత్ పార్టీ ఇంచార్జ్ ముందుకు చెప్పుకున్నారు.* రాహుల్ గాంధీ ఇన్డైరెక్ట్ గా సీఎం ఛేంజ్ ఇండికేషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ ను పనిచేయనివ్వడం లేదని భట్టి, ఉత్తమ్, పొంగులేటిని అనుమానిస్తున్నారు. మూటల పంచాయతీ నడుస్తోంది. ఎవరి శాఖ వాళ్లదే అన్నట్లుగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మేం ఎస్ఎల్బీసీకి వెళ్లిన తర్వాత సీఎం రేవంత్ అక్కడకు వెళ్లివచ్చారు.ప్రతీ అంశం ఢిల్లీ కి చెరవేస్తున్నది.. రేవంత్ ను ఏ పని చేయకుండా అడ్డుకుంటున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అనుకుంటున్నారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ ను తీసుకు వచ్చిన.. మాస్టర్ ప్లాన్ ఉత్తమ్ కుమార్ రెడ్డే. మిలటరీ మాస్టర్ ప్లాన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డివే. గతంలో ఇంచార్జ్ గా కుంతియాను తెచ్చుకున్నది ఉత్తమ్ కుమారే. మూడు మంత్రులు పోటీపడి అధిష్టానానికి కప్పం కడుతున్నారు. ఆ ముగ్గురు సీఎం రేవంత్ తో సంబంధం లేకుండా నేరుగా అధిష్టానంతో డీల్ చేసుకుంటున్నారు’ అని మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. -
సీఎం రేవంత్కు హరీష్రావు స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం పనులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టన్నెల్ పనులు ముందుకు కదలేదని రేవంత్ చేసిన ఆరోపణలనూ హరీష్ ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో SLBC టన్నెల్ పనులు జరగలేదని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. లేకుంటే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేస్తారా? అని హరీష్ రావు సవాల్ విసిరారు. మా హయాంలో టన్నెల్ పనులు జరిగాయి. 11. కిమీలకు పైగా సొరంగం తవ్వాం.. ఇందుకుగానూ రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం.ఈ విషయంలో మేం చర్చకు సిద్ధం అని హరీష్ రావు అన్నారు. అలాగే.. తన దుబాయ్పై పర్యటనపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. దుబాయ్లో మిత్రుడి కుమార్తె వివాహానికి వెళ్లాను. ఫిబ్రవరి 21న దుబాయ్కి వెళ్లే.. 22వ తేదీన ప్రమాదం జరిగింది. దీనిని రాజకీయం చేయడం తగదు అని అన్నారాయన. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద పది రోజుల కింద సొరంగం పైకప్పు కూలిపోయి ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం పాలమూరు పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టన్నెల్ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఆపై టన్నెల్ వద్దకు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారాయన. -
రేవంత్.. మార్చి ఎనిమిది మీకు డెడ్లైన్: కవిత హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని గుర్తుచేశారు.మహిళలకు ఇచ్చిన హామీల సాధనకై ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల నుంచి 10వేల పోస్టుల కార్డులు సేకరించారు. అనంతరం, పోస్టు కార్డులను ముఖ్యమంత్రి రేవంత్కు పంపించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. హమీల అమలుపై మార్చి 8(మహిళా దినోత్సవం)న ప్రకటన చేయకపోతే 10వేల మంది మహిళలు పదివేల గ్రామాల్లోకి వెళ్తారు. లక్షలాది పోస్టు కార్డులు తయారు చేసి సోనియా గాంధీకి పంపిస్తాం.మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు. వరంగల్ ఎయిర్పోర్టుకు రాణి రుద్రమాదేవి పేరు పెట్టాలి. ఈ విషయంలో మేము కూడా కేంద్రానికి లేఖ రాస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు.. ఆయన ప్రారంభించిన పెట్రోల్ పంప్కు పోలిక లేదు.ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలు కేవలం పదుల సంఖ్యలో మహిళలకు తప్ప పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగే అవకాశం లేదు. మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. అప్పుడు ఎక్కువ మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. 18ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. అప్డేట్స్
MLC Election Counting Updates..కరీంనగర్ జిల్లా :కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బిజెపిటీచర్స్ ఓట్ల లెక్కింపు పూర్తి.భారీ మెజారిటీతో బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్య విజయం.అధికారికంగా ఇంకా ప్రకటించని అధికారులు.కరీంనగర్ జిల్లా:కరీంనగర్ టీచర్ MLC మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య గెలుపుకాసేపట్లో అధికారిక ప్రకటనవరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్ నల్లగొండ జిల్లా :కౌంటింగ్ హాల్ వద్ద మీడియాతో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిగెలుపోటములు సహాజంఓటమిని అంగీకరిస్తున్నాగెలిచిన అభ్యర్థి ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాలని సూచిస్తున్నఓడిపోయినందుకు బాధపడటం లేదుఉపాధ్యాయులు రెండోసారి నన్ను గెలిపించాలని అనుకోలేదేమోప్రచారం ఉధృతంగా చేసినా నేను ఎందుకు ఓడిపోయానో ఉపాధ్యాయులకు తెలుసు. దాని గురించి ఇప్పుడు మాట్లాడాలని అనుకోవడం లేదు.వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియ18 రౌండ్ ఫలితాలుటీ పీఆర్టీయూ అభ్యర్థి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేట్మరికాసేపట్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియవరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న 17వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియస్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభంసుందర్ రాజుకు వచ్చిన (3115) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియతొలి స్థానంలో ఉన్న పీఆర్టీయూ అభ్యర్థి టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి విజయానికి ఇంకా 4149 ఓట్లు అవసరంరెండో స్థానంలో ఉన్న యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి 6162 ఓట్లు అవసరంవరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :15 రౌండ్ ఫలితాలుబీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :16 రౌండ్ ఫలితాలుబీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి ఎలిమినేట్సరోత్తం రెడ్డి ఎలిమినేషన్ తర్వాతశ్రీపాల్ రెడ్డి- 7673అలుగుబెల్లి నర్సిరెడ్డి- 5660హర్షవర్ధన్ రెడ్డి- 5309పూల రవీందర్- 3992కరీంనగర్ :టీచర్స్ కోటా ఎమ్మెల్సీలో ముందంజలో ఉన్న బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యసంబరాలకు సిద్దమవుతున్న బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యమొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపు దిశగా కొమరయ్యకరీంనగర్: కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ టేబుల్ కౌంటింగ్.మొదటి 14 వేల ఓట్ల లెక్కింపు సాగుతుండగా.. లీడ్ లో కొనసాగుతున్న బిజెపి అభ్యర్థి మల్క కొమురయ్యవిక్టరీ సింబల్ చూపిస్తూ కౌంటింగ్ ఆలోచించి బయటికి వచ్చిన మల్క కొమురయ్యవరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :ప్రారంభమైన 16వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియబీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభంసరోత్తం రెడ్డికి వచ్చిన (2289) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా:15 రౌండ్ ఫలితాలుస్వతంత్ర అభ్యర్థి సుందర్ రాజు(2040 ఓట్లు) ఎలిమినేట్15వ రౌండ్ తర్వాత ఓట్ల వివరాలుశ్రీపాల్ రెడ్డి- 6916అలుగుబెల్లి నర్సిరెడ్డి- 5205హర్షవర్ధన్ రెడ్డి- 4799పూల రవీందర్- 3617పులి సరోత్తం రెడ్డి-2645వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న 15వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియస్వతంత్ర అభ్యర్థి సుందర్ రాజు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభంసుందర్ రాజుకు వచ్చిన (2040) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :పన్నెండో అభ్యర్థి బాబు రావు( 128 ఓట్లు) ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :కొనసాగుతున్న 13 వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియకొలిపాక వెంకటస్వామి (421 ఓట్లు) ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :ముగిసిన నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుచెల్లుబాటు అయిన ఓట్లు- 23,641చెల్లని ఓట్లు- 494గెలుపు కోటా- 11822 గా నిర్ధారణ12 రౌండ్లు ముగిసిన తర్వాత వచ్చిన ఓట్లుశ్రీపాల్ రెడ్డి- 6105అలుగుబెల్లి నర్సిరెడ్డి- 4884హర్షవర్ధన్ రెడ్డి- 4502పూల రవీందర్- 3202పులి సరోత్తం రెడ్డి- 2337సుందర్ రాజు-2091వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :14 రౌండ్ ఫలితాలుకొలిపాక వెంకటస్వామి (421 ఓట్లు) ఎలిమినేట్14వ రౌండ్ తర్వాత ఓట్ల వివరాలుశ్రీపాల్ రెడ్డి- 6165అలుగుబెల్లి నర్సిరెడ్డి- 4946హర్షవర్ధన్ రెడ్డి- 4596పూల రవీందర్- 3249పులి సరోత్తం రెడ్డి- 2394సుందర్ రాజు-2141వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా: ప్రారంభమైన ఎలిమినేషన్ ప్రక్రియతొమ్మిదో అభ్యర్థి తాటికొండ రాజయ్య( 36 ఓట్లు) ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా :ఏడో అభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి(24 ఓట్లు) ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా : ఎనిమిదో అభ్యర్థి కైలాసం( 26 ఓట్లు) ఎలిమినేట్వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా: ప్రారంభమైన ఎలిమినేషన్ ప్రక్రియఎవరికీ గెలుపు కోటా రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తోన్న అధికారులుచలిక చంద్ర శేఖర్ 1 ఓటు, కంటే సాయన్న. 4 ఓట్లు, బంక రాజు 7 ఓట్లు, పురుషోత్తం రెడ్డి 11, లింగడి వెంకటేశ్వర్లు 15, అర్వ స్వాతి 19 ఎలిమినేటర్కరీంనగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఆలస్యంగా పట్టభద్రుల కౌంటింగ్ ప్రక్రియనేటి రాత్రి వరకు కొనసాగనున్న బ్యాలెట్ పేపర్ల బెండల్స్ కట్టడం ప్రక్రియవ్యాలీడ్ ఇన్ వ్యాలిడ్ ఓట్ల పరిశీలనకు రాత్రి వరకు సమయం పట్టే అవకాశంరాత్రి వరకు ఎమ్మెల్సీ ఓట్లు కట్టలు కట్టి సపరేషన్ ప్రక్రియఅర్ధరాత్రి దాటిన తర్వాతే పట్టభద్రుల అసలు ఓట్ల లెక్కింపుచెల్లని ఓట్లు ఎక్కువగా పోల్ కావడంతో అభ్యర్థుల్లో ఆందోళనచెల్లని ఓట్లతో ప్రధాన పార్టీల అభ్యర్థులకే నష్టం అంటున్న ప్రసన్న హరికృష్ణగెలుపు ధీమా వ్యక్తం చేసిన ప్రసన్న హరికృష్ణటీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ బండెల్స్ కట్టడం పూర్తివరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్నల్లగొండ జిల్లాముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుమొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక లీడ్ లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డిరెండో స్థానంలో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిమూడో స్థానంలో టీ పీఆర్టీయూ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డినాలుగో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్ఐదో స్థానంలో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డికాసేపట్లో చెల్లని ఓట్లను తొలగించి గెలుపుకు కావాల్సిన కోటాను ప్రకటించనున్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లామరికాసేపట్లో ముగియనున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఇప్పటి వరకు పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి ముందంజమొదటి ప్రాధాన్యత ఓట్లలో అత్యధికంగా శ్రీపాల్ రెడ్డికి నమోదుఆ తర్వాత యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డిమూడోస్థానంలో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డిరెండో ప్రాధాన్యత ఓట్లతోనే విజేత ఎవరనేది తెలిసే అవకాశంమొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక చెల్లని ఓట్లను తొలగించి గెలుపు కోటాను నిర్ణయించనున్న అధికారులువరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్ డేట్నల్లగొండ జిల్లా..మరికాసేపట్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం.ముగిసిన బ్యాలెట్ పత్రాల కట్టలు కట్టే ప్రక్రియ25 టేబుళ్లపై ఓట్ల లెక్కింపుటేబుల్ కు 40 కట్టల కేటాయింపుఒక్కో కట్టలో 25 ఓట్లుఒక్కో టేబుల్ కు 1000 ఓట్ల కేటాయింపుమిగిలిన ఓట్లు చివరి టేబుల్ కు కేటాయింపుమధ్యాహ్నం మూడు గంటల వరకే ముగియనున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుచెల్లని ఓట్లను తొలగించి గెలుపుకు కావాల్సిన కోటాను నిర్ణయించనున్న అధికారులుమొత్తం పోలైన ఓట్లు- 24139👉ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్, నల్లగొండలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడికానున్నాయి. పట్టుభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశముంది. 👉కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. దీనికోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్లు కోసం కేటాయించారు. 👉ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా, ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. 👉గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3.55 లక్షల ఓట్లు, టీచర్ నియోజకవర్గంలో 27,088 ఓట్లు ఉన్నాయి. 👉ఈ క్రమంలో టీచర్ల లెక్కింపు సాయంత్రానికి వెలువడే అవకాశాలు ఉండగా.. గ్రాడ్యుయేట్ మాత్రం మరునాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గ్రాడ్యుయేట్ స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, టీచర్ ఎమ్మెల్సీ బరిలో 15 మంది తలపడుతున్నారు. 👉వరంగల్–ఖమ్మం–నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్జాలబావి సమీపంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 24,139 మంది ఓట్లు పోలయ్యాయి. -
అప్పుడు లేని తపన ఇప్పుడెందుకు?: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ సీఎం రేవంత్, మంత్రులు కూడా ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని మోదీ.. సీఎంతో ఫోన్లో మాట్లాడారు. కేంద్రం కూడా బృందాలు పంపి సహకరిస్తుంది. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. రిస్క్ అని తెలిసి కూడా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు’’ అని జగ్గారెడ్డి అన్నారు.ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య శాశ్వతంగా పోవాలని మంచి నీళ్లు ఇచ్చేందుకు దీనిని వైఎస్ చేపట్టారు. ఫ్లోరైడ్తో నల్గొండలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైఎస్ గుర్తించి.. శ్రీశైలం నీళ్ళు నల్గొండ ప్రజలకు ఇవ్వాలని భావించారు. రూ.1925 కోట్లతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎస్ఎల్బీసీ పూర్తి కావాల్సి ఉండే.. కానీ కాలేదు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేయాలని మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నల్గొండలో 4 నుంచి 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కనీస అవగాహన ఉండాలి. ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తిస్తుంది.’’ అని జగ్గారెడ్డి తెలిపారు.‘‘హరీష్రావు ఆర్థిక మంత్రిగా.. ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఎందుకు పూర్తి చేయలేదు? అప్పుడు లేని తపన ఇప్పుడు ఎందుకు?. హరీష్రావు ముసలి కన్నీరు కారుస్తున్నారు. కొండగట్టు బస్సు ప్రమాదం జరిగితే.. అప్పటి సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు. హరీష్రావు గొంతు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం జవాబుదారీ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. బీజేపీ క్రమశిక్షణ లేని పార్టీ. కిషన్ రెడ్డి బీసీలను అణచివేస్తుందని ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు’’ అని జగ్గారెడ్డి గుర్తు చేశారు. -
సమస్య మోదీ కాదు.. కిషన్రెడ్డి: సీఎం రేవంత్
సాక్షి, వనపర్తి: బీఆర్ఎస్, బీజేపీ నేతల తప్పుడు మాటలు నమ్మొద్దని.. ఆ పార్టీలు కలిసి కాంగ్రెస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇందిరమ్మ ప్రభుత్వంలో ఒకేసారి రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేశాం. 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పథకాలు అమలు చేయడం లేదని ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలకు వాతలు పెట్టాలి’’ అంటూ వ్యాఖ్యానించారు.ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. రైతు భరోసా డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో జమ చేశామని సీఎం పేర్కొన్నారు.కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘రాష్ట్రానికి సమస్య మోదీ కాదు.. కిషన్రెడ్డి’ అంటూ రేవంత్ ధ్వజమెత్తారు. తెలంగాణపై కిషన్రెడ్డి పగబట్టారు. ఆయనకు ఎందుకంత అక్కసు?. ఖట్టర్ సమీక్షకు హాజరుకాని కిషన్రెడ్డి.. మెట్రోకు సహకరిస్తున్నారంటే నమ్మాలా?. కిషన్రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదు. ఎస్ఎల్బీసీ ప్రమాదానికి గత ప్రభుత్వమే కారణం. పాలమూరు బిడ్డ సీఎం అయితే ఓర్వలేకపోతున్నారు.’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. -
‘SLBC దగ్గరకు వెళ్లేందుకు సీఎంకు టైం లేదు’
హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అక్కడకు వెళ్లే టైం లేదని విమర్శించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన రఘునందన్ రావు.. గత ఎనిమిది రోజులుగా సీఎం రేవంత్.. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలిని సందర్భించే తీరిక లేదన్నారు. తెలంగాణలో పాలన పడకేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేకుండా రేవంత్ ఢిల్లీ వెళ్లి వచ్చారు.. రేవంత్ ఒకవేళ కలిస్తే ఒక్క ఫోటో కూడా ఎందుకు విడుదల చేయలేదు. పేరుకే పీసీసీ అధ్యక్ష పదవి బీసీకి ఇచ్చారు. సీఎం పదవి బీసీలకు ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాయాలని పీసీసీ చీఫ్ గా ఉన్న మహేస్ కుమార్ గౌడ్ కు సూచిస్తున్నా. జీహెచ్ఎంసీలో ఒక అధికారికి ఐదేళ్లుగా డిప్యూటేషన్ మీద పని చేస్తున్నారు. ఇక మున్సిపల్ పాలనపై సీఎం రేవంత్ కు పట్టులేదు. మమునూరు ఎయిర్ పోర్ట్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదు. గద్వాల ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ లో తన ఫోటో కాంగ్రెస్ ఫ్లెక్సీలో వేస్తున్నారని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. కిషన్ రెడ్డి సౌమ్యుడు.. ఆయన గురించి మాట్లాడే హక్కు రేవంత్ కు లేదు. ఆరు మంత్రి పదవులు భర్తీ చేసుకోలేని పరిస్థితి రేవంత్ది‘త్రిభాషా సిద్ధాంతానికి పునాదులు వేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా రేవంత్ మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉర్దూ భాష ఎందుకు రాస్తున్నారు. 90 శాతం జనాలకు ఉర్దూ రాకపోయినా ఎందుకు బోర్డులపై రాస్తున్నారు. ఎవరికి భయపడి ఉర్దూ భాష రాస్తున్నారు. అసెంబ్లీలో అక్బరుద్దీన్ అనుమతి తీసుకొని రేవంత్ తెలుగులో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ లో ఏ భాషలో మాట్లాడతారు. వ్యక్తిగత విమర్శలపై మేం మాట్లాడగలం . సిద్ధాంతం మీద, ప్రజా సమస్యలపై చర్చకు సిద్దం. వేదిక, సమయం చెప్పాలని సీఎం రేవంత్ కు సవాల్ విసురుతున్నా. కేటీఆర్ మీద ఏసీబీ కేసు పెట్టింది.. ఇక్కడ కేంద్రానికి ఏం సంబంధం.. రేవంత్ ను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం మరిచిపోయినట్లున్నారు. కేసీఆర్ ను అరెస్ట్ చేయడానికి రేవంత్ భయపడుతున్నారు’ అంటూ రఘునందన్ రావు మండిపడ్డారు. -
అందుకే నాపై విమర్శలు.. రేవంత్కు కిషన్రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: పద్నాలుగు నెలల్లో ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా? అంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని దుయ్యబట్టారు. శనివారం ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అనేక రకాల హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. గతేడాది డిసెంబర్లోపు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఏవి?. ఇళ్లులేని వారందరికీ రూ.5 లక్షలు, ఇంటి స్థలం ఇస్తామన్నారు.. ఏమైంది?’’ అంటూ కిషన్రెడ్డి నిలదీశారు.‘‘బాధ్యతలు, హామీలను విస్మరించి సీఎం గాలి మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ గెలిపించి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్రెడ్డి నాపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలే సీఎం అసహనానికి కారణం. రేవంత్రెడ్డి తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నాం. నేను బెదిరింపు రాజకీయాలు చేస్తున్నానన్నది అవాస్తవం. సీఎం రేవంత్ దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారు’’ అని కిషన్రెడ్డి మండిపడ్డారు. -
రేవంత్ చేసింది చెబితే చెవుల్లోంచి రక్తం కారుతుంది: కేటీఆర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రైజింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని, కానీ నేరాల్లో.. అప్పుల్లో ఆ రైజింగ్ కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఎద్దేవా చేశారు. శనివారం బీఆర్ఎస్ చేరికల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇంచార్జి వస్తే సమావేశం పెట్టారు. ఆ మీటింగ్లో సీఎం రేవంత్ మూడు ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పారు. మంచి మైకులో చెప్పాలని.. చెడు చెవిలో చెప్పాలని ఆయన అన్నారు. మైక్లో చెప్పడానికి రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన మంచి ఏం లేదు. ఆయన చేసిన చెడు చెబితే చెవుల నుంచి రక్తం కారుతుంది. జనం కాంగ్రెస్ను.. రేవంత్ను తిట్టుకుంటున్నారు అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) నా బ్యాగులు మోయవద్దని అంటున్నారు. కానీ, ఆమె వాస్తవాలు తెలుసుకోవాలి. మీ పక్కన కూర్చున్న రేవంత్ రెడ్డి బ్యాగులు మోసి ఇక్కడికి వచ్చారు. రేవంత్ రెడ్డికి టింగ్,టింగ్ అంటే నచ్చదు. అందుకే రేవంత్ రెడ్డి టకీ,టకీ మని పైసలు పడతాయని అన్నారు. మరి ఇప్పటి వరకు ఎవరికైనా టకీ,టకీ మని పైసలు పడ్డాయా?. పదిశాతం ఖర్చు పెడితే శ్రీశైలం జలాలు చేవెళ్లకు వచ్చేవి కానీ రేవంత్ రెడ్డికి ఇష్టం లేక చేయడం లేదు. కమీషన్లు రావనే ఉదేశ్యంతోనే పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేయడం లేదు. మూసీ వలన జరిగే లాభం ఎంత. కమీషన్ల కోసమే మూసీ అనే రంగుల సినిమా చూపుతున్నారు. మూసీతో 50-70 వేల కోట్లు కమీషన్లు తీసుకొని ఢిల్లీకి మూటలు పంపి సీఎం కుర్చీని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు. నీళ్లు పాతాలానికి వెళ్లాయి నిధులు ఢిల్లీకి పోతున్నాయి.తెలంగాణ రైజింగ్(Telangana Rising) అని రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ, ఆ రైజింగ్ క్రైమ్ రేట్లో, అప్పుల్లో కనిపిస్తోంది. ఆత్మహత్యల్లో రైజింగ్, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల్లో రైజింగ్. గురుకుల పాఠశాలల విద్యార్థుల మరణాల్లో రైజింగ్. కేసీఆర్ అప్పులు తెచ్చి మరీ ఆస్తులు సృష్టించారు. మరి ఈ ఏడాదిలో లక్షా 50 వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రేవంత్ ఏం సాధించారు?.రేవంత్ రెడ్డి హైడ్రా పెట్టింది నా కోసమే. అధికారంలోకి వచ్చి 15 నెలల తర్వాత ఇంకా కేసీఆర్ ను తిట్టుకుంటా బ్రతుకుతావా?. అన్ని చూసుకోకుండా ఆగం,ఆగంగా కమీషన్ల కోసం SLBC పనులు ప్రారంభించారు. ఎనిమిది మంది చిక్కుకుంటే.. సహాయక చర్యల పేరుతో మంత్రులు చాపల కూరలు తింటున్నారుకేసీఆర్(KCR) మన ఇంట్లో పెద్ద మనిషి,బాపు లాంటోడు కాబట్టే ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారు. కేసీఆర్ దళంలోకి.. గులాబీ వనంలోకి కార్తీక్ రెడ్డి(karthik Reddy)ని ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి. త్వరలోనే కార్తీక్ ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగుపెడతారు. కేసీఆర్ కు తెలంగాణపై ఉండే ప్రేమ కాంగ్రెస్,బీజేపీకి ఒక్క శాతం అయినా వుంటుందా?. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచి ఏం చేసింది?. ఒక్క రూపాయి ఇవ్వని బీజేపీ నేతలు ఓట్లు ఎట్లా అడుగుతారు?. దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతారా?. మనల్ని మనం ఓడించి.. మంది ముందు దరఖాస్తు పెట్టే పరిస్థితి వచ్చింది. పంచాయతీ ఎన్నికలు అయినా పార్లమెంట్ ఎన్నికలు అయినా ఎగరాల్సింది గులాబీ జెండానే. కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు.. జాగ్రత్త’’ అని కేటీఆర్ అన్నారు.ఇదీ చదవండి: మామునూర్ ఎయిర్పోర్టు క్రెడిట్ కోసం ఢిష్యూం.. ఢిష్యూం -
వరంగల్లో ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ
సాక్షి, మామునూర్: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాలో మామునూరు విమానాశ్రయం వద్ద ఇరు వర్గాల నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో జై మోదీ అని బీజేపీ కార్యకర్తలు.. జై కాంగ్రెస్ అంటూ హస్తం పార్టీ నినాదాలు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాల నేతలు అడ్డుకున్నారు.మామునూర్ ఎయిర్పోర్టు విషయమై వరంగల్లో ఉద్రిక్తత నెలకొంది. మామునూర్ విమానాశ్రయానికి ఇటీవల కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విమానాశ్రయానికి కేంద్రం అనుమతి ఇవ్వడంతో ప్రధాని మోదీకి పూలాభిషేకం చేసేందుకు బీజేపీ శ్రేణులు శనివారం ఉదయం అక్కడికి చేరుకున్నాయి. విమానాశ్రయం వద్ద మోదీకి పూలాభిషేకం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు.కాగా, బీజేపీ నేతలు అక్కడికి వచ్చిన సమయంలోనే కాంగ్రెస్ శ్రేణులు సైతం విమానాశ్రయం వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే విమానాశ్రయం రెడీ అవుతోందని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఇరు వర్గాలు మధ్య ఘర్షణ తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇరు వర్గాల నేతలు ఎన్నికల కోడ్ను ఉల్లఘించడం గమనార్హం. -
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్(తీన్మార్ మల్లన్న)కు బిగ్ షాక్ తగిలింది. మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, పైగా పార్టీ శిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వలేదని, అందుకే క్రమశిక్షణ చర్యల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు. ఇక, ఎమ్మెల్సీ మల్లన్న సస్పెన్షన్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పార్టీ లైన్ ఎవరు దాటినా ఊరుకునేది లేదు. మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించాం. బీసీ కుల గణన ప్రతులను చించడంపై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు. పార్టీ లైన్ దాటితే ఎవ్వరినీ వదలిపెట్టం’ అని హెచ్చరించారు. వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలు, కులగణన నివేదికపై మల్లన్న ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ వర్గాన్ని కించపరిచేలా ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకుగానూ ఫిబ్రవరి 5వ తేదీన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కోరింది. అయితే.. ఆయన నుంచి స్పందన లేకపోవడంతో ఇవాళ చర్యలకు ఉపక్రమించింది. సొంత పార్టీ విషయంలో నవీన్ వైఖరి మొదటి నుంచి చర్చనీయాంశంగానే ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన నివేదిక ప్రతులను ఆయన దగ్ధం చేశారు. అలాగే.. సర్వేలో 40 లక్షల మంది బీసీలను తగ్గించారని ఆరోపించారు. కుల గణన నివేదికను వ్యతిరేకించాలని పిలుపు కూడా ఇచ్చారు. మరోవైపు.. వరంగల్లో జరిగిన బీసీ సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడంపై పీసీసీకి ఫిర్యాదులు అందాయి. రెడ్డి కులాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు పార్టీ శ్రేణులు కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించి మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి కులానికి బహిరంగ క్షమాపణ చెప్పి మల్లన్న తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆ సంఘం ప్రతినిధులు హెచ్చరించారు కూడా. ఈ క్రమంలో.. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ జి.చిన్నారెడ్డి మలన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే జానారెడ్డి కళ్లలో ఆనందం కోసమే తనకు చిన్నారెడ్డి నోటీసులు జారీ చేశారంటూ కరీంనగర్లో నవీన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. -
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్లో మరో అలజడి రేగింది. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కనపెడుతున్నారని, నిన్న మొన్న చేరుతున్నవాళ్లకు పదవులు ఇవ్వడం ఏమాత్రం సరికాదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి(Malreddy Rangareddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.రాష్ట్ర జనాభాలో అధికంగా.. 42 శాతం జనాభా రంగారెడ్డి జిల్లాలోనే ఉంది. అలాంటి జిల్లాకు దయచేసి అన్యాయం చేయకండి. గతంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్(Hyderabad) జిల్లాలకు కనీసం ఆరుగురు మంత్రులు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఎంత మంది ఉన్నారు?. ఒకవేళ సామాజిక సమీకరణలు అడ్డు వస్తున్నాయంటే రాజీనామాకు నేను సిద్ధం. జిల్లా అభివృద్ధి కోసం.. మంత్రి ప్రాతినిధ్యం కోసం ఇంకొకరిని గెలిపించేందుకు నేను రెడీ అని కాంగ్రెస్ అధిష్టానంను ఉద్దేశించి మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోనైనా గ్రేటర్ పరిధిలోని నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని అన్నారాయన. ఇక.... పార్టీలోకి ఎవరొచ్చినా గౌరవం ఇవ్వాలి. కానీ పదవులు ఇవ్వొద్దు. ఇప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వాళ్ళని మంత్రులుగా తీసుకోవద్దు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టడం సరైంది కాదు. పని చేసిన వారిని పక్కన పెడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వస్తున్నాయి. కనీసం పదేండ్లు కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వాలి. కార్యకర్తల మనోభావాలను.. నేతల సీనియారిటీనీ పరిగణనలోకి తీసుకోవాలి అని ఆయన కోరారు. ఈ క్రమంలో ‘‘పార్టీ లైన్ దాటోద్దు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్న’’ అని మల్రెడ్డి వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
పేదల కన్నీళ్లు అర్థం చేసుకోవాలి.. వారి ముఖాల్లో సంతోషం కన్పించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఇలాంటివి ఇంకెక్కడా జరగ డం లేదని తాను భావిస్తున్నానని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చెప్పారు. ‘‘మనకు ఇంకా నాలుగేళ్ల సమయముంది. మన ప్రభుత్వం, సీఎం అనేక పనులు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.మనం ప్రభుత్వాన్ని నడపడం ద్వారా తెస్తున్న మార్పు మన అంతర్గత వ్యవహారాల్లోనూ కనిపించాలి. మనం కళ్లు మూసుకుంటే పేదల ముఖాలు కనిపించాలి.వారి కన్నీళ్లు అర్థం చేసుకోగలగాలి. వారి ముఖాల్లో సంతోషం కనిపించేలా చేయాలి. అప్పుడే మనం సవ్య దిశలో వెళ్తున్నట్టు. అలా జరగకపోతే మన పంథాను మార్చుకోవాలి. మార్చుకోకపోతే ప్రజల్లో విశ్వాసం ఉండదు..’ అని అన్నారు. శుక్రవారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి ఆమె హాజరయ్యారు. కార్యకర్తలు ఆత్మగౌరవంతో బతకాలి: ‘చివరి బంతిలో కూర్చున్న వారికి కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయో లేదో సమీక్ష చేసుకోవాలి. అలా అందకపోతే మనం ప్రభుత్వంలోకి వచ్చి ఉపయోగం లేదు. కాంగ్రెస్ కార్యకర్తల కృషితోనే అధికారంలోకి వచ్చాం. కార్యకర్తలు ఆత్మగౌరవంతో బతకాలి. వారు ఆత్మగౌరవంతో నిలబడేలా చేయాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన వారిపై ఉంటుంది. తెలంగాణతోపాటు పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇది మన ప్రభుత్వమని కార్యకర్తలకు అనిపించాలి. ప్రభుత్వంలో కార్యకర్తల భాగస్వామ్యం ఉండాలి. పదేళ్లపాటు జెండా మోసిన వారి అభిప్రాయాలను విని, వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది..’ అని మీనాక్షి చెప్పారు. సామాజిక సర్వే ఎజెండా క్షేత్రస్థాయికి చేరాలి: ‘ఓవైపు ప్రత్యర్థి పార్టీల రాజకీయ వాదాలను నియంత్రిస్తూనే, కాంగ్రెస్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అందువల్ల వ్యక్తి వాదం వద్దు. అందరం కలిసి సంఘటితంగా పనిచేయాలి. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ కూడా ఉంది. ఆ పార్టీతో పోరాడే విధానం వేరుగా ఉండాలి. బీజేపీ, బీఆర్ఎస్లకు పెద్ద తేడా ఏమీ లేదు. అయితే వారిని ఎదుర్కొనేందుకు నిర్దిష్ట కార్యాచరణ ఉండాలి.దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన జరిగింది. ఇది దేశానికే రోల్మోడల్ కావాలి. సామాజిక సర్వే ఎజెండా క్షేత్రస్థాయికి చేరాలి. ప్రభుత్వం ఎంత పనిచేసినా పార్టీపరంగా ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ఉపయోగం ఉండదు. జై బాపూ, జై భీం, జై సంవిధాన్ కార్యక్ర మాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇందుకోసం జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కార్యాచరణ రూపొందించుకోవాలి..’ అంటూ దిశానిర్దేశం చేశారు. రైల్వేస్టేషన్కు రావొద్దు.. బ్యాగులు మోయొద్దు: ‘అందరం అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దాం. పార్టీ కార్యకర్తలు ఎవరు ఫోన్ చేసినా నేను మాట్లాడతా. నా కోసం ఎవరూ రైల్వేస్టేషన్కు రావాల్సిన అవసరం లేదు. పార్టీ కార్యకర్తలను వెనుక తిప్పుకోవడం, జిందాబాద్లు కొట్టించుకోవడం సరికాదు. నా బ్యాగులు కూడా ఎవరూ మోయవద్దు. ఒకవేళ నాకు బలం లేకపోతే నేనే సహాయం అడుగుతా. బ్యానర్లు, హోర్డింగుల్లో ఫొటోలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలంటే కుదరదు. ప్రజల్లో ఉన్నప్పుడే గెలుస్తారు. పార్టీ కార్యకర్తలు వారి పనిచేసుకుంటూ వెళ్లాలి. ఎక్కడా ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకోవద్దు. ఏడాది కష్టపడిన విధంగానే మరో నాలుగేళ్లు కష్టపడదాం. అందరితో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వమంటే పేదల ప్రభుత్వమని నిరూపిద్దాం..’ అని మీనాక్షి పిలుపునిచ్చారు. -
‘పేదల ముఖాల్లో నవ్వులు చూడాలి.. అప్పుడే మనం పని చేసినట్లు’
హైదరాబాద్: ప్రస్తుతం మన ప్రభుత్వంలో ఉన్నామని, పేదవాడి కోసం పని చేయాలన్నారు తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్., ఈరోజు హైదరాబాద్ లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘ఇప్పుడు మనం ప్రభుత్వం లో ఉన్నాం.. పేద వాడి కోసం పని చేయాలి. పేదల మొఖంలో నవ్వులు చూడాలి.. అప్పుడే మనం పని చేసినట్టు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో పోరాట శక్తి ఉంది.. అనేక రకాలుగా పోరాటాలు చేసాము.. అందుకే తెలంగాణ లో అధికారంలోకి వచ్చాము.రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ కోసం భారత్ జొడో యాత్ర నిర్వహించి ఒక మైదానాన్ని తయారు చేశారు.మనం దాని కోసం పోరాటం చేయాలి. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలతో మనం ఇక్కడ పోరాటం చేయాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్రాన్ని తెచ్చింది... కాంగ్రెస్ ఎలాంటి పోరాటానికి అయిన సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలి పదేళ్లు గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేసారు. వారికి న్యాయం జరగాలి.. పదవులు పొందిన వారు ప్రజల కోసం పని చేయాలి. మనం చేసిన పనులను ప్రజలకు వివరించాలి. దేశంలో ఎక్కడా లేని విదంగా ఇక్కడ కులఘనన చేపట్టాము.. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి గ్రామ గ్రామానికి వెళ్లి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. గ్రామ గ్రామన పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలి. ఈ విషయంలో పీసీసీ ఒక పకడ్బందీగా కాలెండర్ సిద్ధం చేయాలి’ అని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. -
‘ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా కార్యకర్తలు పని చేయాలి’
హైదరాబాద్: ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలన్నారు మంత్రి సీతక్క. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘ అధికారం అనేది వస్తుంది.. పోతుంది. కానీ 140 ఏళ్లుగా దేశానికి పార్టీ సేవలు చేస్తుంది.పార్టీ అనేది తల్లి లాంటిది. తల్లి లేకపోతే పిల్లలు అనాథలు అవుతారు. కాబట్టి క్షేత్ర స్థాయిలో పార్టీ జెండా పండగ కార్యక్రమాలు చేయాలి. గ్రామ గ్రామాన ప్రభుత్వ కార్యక్రమాలు వివరించాలి. అర్హులకు పథకాలు అందేలా చూడాలి. ప్రజల్లోకి విస్తృతంగా ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకు వెళ్ళాలి. భవిష్యత్ లో పార్టీ బలోపేతం కు ఉపయోగ పడుతుంది. రాహుల్ గాంధీ చరిత్మకమైన భారత్ జోడొ యాత్ర చేశారు. నిర్మాణాత్మకంగా పార్టీ పటిష్టత కోసం పని చేయాలి. మరో వందేళ్లు పార్టీ నిలబడేలా కార్యాచరణ తీసుకోవాలి. పార్టీ లోకి కొందరు వస్తుంటారు పోతుంటారు.. అవేవీ పట్టించుకో వద్దు’ అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.