breaking news
-
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్లో చేరిన కేశవరావు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నేత కేశవరావు కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలక నేతగా, కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కే కేశవరావు ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు.కాగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన కేశవరావు గతంలో అనేక పదవులు కూడా పొందారు. అయితే మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్(బీఆర్ఎస్)లోకి చేరారు. కేసీఆర్తో కలిసి పని చేసిన ఆయనకు రెండుసార్లు ఎంపీగా(రాజ్యసభ) అవకాశం దక్కింది. -
ప్రతి హామీని అమలు చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మబద్ధంగా ప్రతి పైసాను ఖర్చుపెట్టాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. రైతు భరోసాపై విధి విధానాలు రూపొందిస్తున్నాం.. అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. సంపద సృష్టిస్తాం.. ప్రజలకు పంచుతాం’’ అని భట్టి అన్నారు.రుణమాఫీపై బీఆర్ఎస్ డ్రామాలాడుతోందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా ప్రకటన చేస్తామని భట్టి తెలిపారు.ఏడు మండలాల కోసం బీఆర్ఎస్ దీక్ష చేయాలి. ఏడు మండలాలు పోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీనే. పదేండ్ల పెండింగ్ సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారు. విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావన లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్స్తో ఏడు మండలాలను ఏపీలో కలిపారు. ఏడు మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఏమయ్యాడు.’’ అని భట్టి ప్రశ్నించారు.‘‘క్యాబినెట్ విస్తరణ పూర్తిగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. పీసీసీ నూతన చీఫ్ విషయంలో కసరత్తు కొనసాగుతుంది. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. పదిహేనేండ్లు మేమే అధికారంలో ఉంటామని చెపుతున్న కేసీఆర్వి కల్లిబొల్లు కబుర్లే. రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. పుట్టింది బతకడానికి.. చావడానికి కాదు. ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే దర్యాప్తు కొనసాగుతోంది. ఆత్మహత్య వెనక ఎవరున్నా విడిచిపెట్టేది లేదు’’ అని భట్టి విక్రమార్క అన్నారు. -
TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన వారిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిని అనర్హులుగా ప్రకటించాలంటూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణ కోసం సోమవారానికి వాయిదా వేసింది. -
ప్రజాపాలనంటే అక్రమ కేసులు బనాయించడమా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు భయపడేది లేదన్నారు.కాగా, కేటీఆర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి బెదిరింపులకు మేము భయపడేది లేదు. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారు.ప్రజా పాలనంటే ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడమేనా?. ప్రజా సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావటమే కౌశిక్ రెడ్డి చేసిన నేరమా?. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలతో పాటు తరగతి గదులలో పారిశుద్ధ్య నిర్వహణ, వసతుల కల్పనపైన మండల విద్యాధికారితో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించటం తప్పా?’ అని ప్రశ్నలు సంధించారు. -
నేడు కాంగ్రెస్లోకి కేశవరావు.. కేబినెట్ విస్తరణ వాయిదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నేత కేశవరావు కాంగ్రెస్లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. కాగా, సీనియర్ నేత కే. కేశవరావు నేడు హస్తం గూటికి చేరనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కేశవరావు కాంగ్రెస్లో చేరనున్నారు. నేడు ఎంపీ పదవి(రాజ్యసభ సభ్యత్వం)కి కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ కాసేపటి క్రితమే ఢిల్లీకి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఇదిలా ఉండగా.. రేపు(గురువారం) తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉన్న విషయం తెలిసిందే. అయితే, సీఎం రేవంత్ హస్తిన పర్యటన నేపథ్యంలో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశంలేదని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. దీంతో, కేబినెట్ విస్తరణ వాయిదాపడే ఛాన్స్ ఉంది. -
7 మండలాలు వెనక్కి రప్పించాలి : హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: దిగువ సీలేరు విద్యుత్ కేంద్రంతోపాటు ఏపీలో విలీనం చేసిన 7 మండలాలను వెనక్కి రప్పించిన తర్వాతే, ఇతర విభజన సమస్యలపై ముందుకెళ్లాలని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు. విభజన సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్రెడ్డికి ఏపీ సీఎం లేఖ రాయడం సంతోషకరమన్నారు. అయితే చంద్రబాబుపైనే ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉన్నందున ఏపీ సీఎంపై ఒత్తిడి చేసి గతంలో విలీనం చేసిన ఏడు మండలాలతో పాటు దిగువ సీలేరు ప్రాజెక్టు తెలంగాణకు దక్కేలా చూడాలని చెప్పారు. తెలంగాణభవన్లో మంగళవారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఏడు మండలాలు, దిగువ సీలేరును తెలంగాణ నుంచి వేరు చేయడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పట్లోనే తీవ్రంగా స్పందించి బంద్కు పిలుపునిచి్చన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో ఏడు మండలాల విలీనం బిల్లును బీజేపీ ప్రవేశపెట్టగా, కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని హరీశ్రావు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తమకు అభ్యంతరం లేదని, ఏడు మండలాలు, దిగువ సీలేరు విద్యుత్ ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ చొరవ చూపాలన్నారు. మురికి కూపంగా పల్లెలు, పట్టణాలు... రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే పల్లెలు, పట్టణాలు మురికి కూపాలుగా మారాయని, పల్లెలు కన్నీరు పెడుతున్నాయని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలకు ప్రతీ నెలా రూ. 275 కోట్లు చొప్పు ఏటా రూ.3,330 కోట్లు, పట్టణాలకు ఏటా రూ.1,700 కోట్లు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ గడిచిన ఏడు నెలలుగా నయాపైసా ఇవ్వకపోవడంతో గ్రామ కార్యదర్శులు సొంతజేబు నుంచి వేలాది రూపాయలు ఖర్చు చేసి ఇబ్బందులు పడుతున్నారన్నారు. డీజిల్ పోసే పరిస్థితి లేక ట్రాక్టర్లు మూలన పడగా, రోడ్ ట్యాక్స్ కట్టలేదని ట్రాక్టర్లు సీజ్ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఏడు నెలలుగా పారిశుధ్య కార్మికులకు వేతనాలు లేవని, కరెంటు బిల్లులు, ట్రాక్టరు కిస్తీల చెల్లింపు, వీధి లైట్లు వేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. సర్పంచ్లతోపాటు జిల్లా, మండల పరిషత్ పదవీకాలం ముగుస్తున్నా, ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శించారు. ఓటేసిన పాపానికి రైతు ఆత్మహత్య కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి ఖమ్మం జిల్లాలో రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభాకర్ తండ్రి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని, రైతుల తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. ప్రభాకర్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూధనాచారి, బీఆర్ఎస్ నేతలు పెద్ది సుదర్శన్రెడ్డి, ఎర్రోల్ల శ్రీనివాస్, దేవీప్రసాద్, పల్లె రవికుమార్, వెంకటేశ్వర్రెడ్డి, బమ్మెర రామ్మూర్తి పాల్గొన్నారు. -
టీపీసీసీ చీఫ్.. కసరత్తు కొలిక్కి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడి నియామక కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గత 20 రోజులుగా అధిష్టానం పరిశీలనలో ఉన్న కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం పలుమార్లు చర్చల అనంతరం తుది దశకు చేరుకుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలంటు న్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్ కుమార్గౌడ్, మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు అధిష్టానం తుది పరిశీలనలో ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అడ్లూరి లక్ష్మణ్కుమార్, బలరాం నాయక్ల పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్సీ కోటాలో తమ జిల్లాకు చెందిన అడ్లూరి లక్ష్మణ్కు అవకాశం ఇవ్వాలని మంత్రి డి.శ్రీధర్బాబు, సీనియర్ నేత జీవన్రెడ్డి అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. అన్ని ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం వారిలో ఒకరిని ఈ నెల ఆరో తేదీలోగా పీసీసీ చీఫ్గా ప్రకటిస్తారని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో మరోమారు అధిష్టానం చర్చించనుంది. ఇందుకోసం సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వారితో చర్చించాక టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే మహేశ్కుమార్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గుచూపే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.మంత్రివర్గం రేసులో బాలూనాయక్, టి. రామ్మోహన్రెడ్డిమంత్రివర్గ విస్తరణలో నల్లగొండ జిల్లాకు చెందిన లంబాడా సామాజికవర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఎన్. బాలూనాయక్కు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. గిరిజన వర్గాల నుంచి ఆదివాసీలకు ఇప్పటికే కేబినెట్లో స్థానం కల్పించినందున లంబాడా సామాజికవర్గానికి కూడా అనివార్యంగా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుందని, ఈ కోటాలో బాలూనాయక్ పేరు కూడా ఉందని తెలుస్తోంది. బాలూనాయక్కు మంత్రి పదవి లభిస్తే డిప్యూటీ స్పీకర్గా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అదే జిల్లాకు చెందిన పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి కూడా మంత్రివర్గంలో స్థానం కోసం ఢిల్లీలోనే ఉండి ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఎవరిని ఏ పదవికి ఎంపిక చేయాలనే విషయంపైనా బుధవారం నాటి చర్చల్లో స్పష్టత రానుంది.పీసీసీ చీఫ్గా నా పేరు పరిశీలించండిఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి కోరిన మహేశ్కుమార్గౌడ్సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా తన పేరును పరిశీలించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఖర్గేను ఆయన కలిశారు. పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న నేతలు అధిష్టానం పెద్దలను కలుస్తూ తమ పేర్లను పరిశీలించాలని కోరుతున్నారు. అందులో భాగంగానే మహేశ్కుమార్గౌడ్ ఖర్గేను కలిసి తన పేరును పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీతోపాటు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కూడా కలవడం తెలిసిందే. -
జగిత్యాల ప్రగతికే కాంగ్రెస్లో చేరా
జగిత్యాల: సీఎం రేవంత్రెడ్డి రైతు పక్షపాతి అని, జగిత్యాల ప్రాంతాభివృద్ధికి ఆయనతో కలిసి పనిచేసేందుకే కాంగ్రెస్లో చేరానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆయన జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.తనను విమర్శించిన ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో హుందాతనంతో రాజకీయాలు చేయాలని, తనపై తప్పుడు ఆరోపణలను ఖండించారు. తన ఆర్థిక పరిస్థితి ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారని సంజయ్ కుమార్ గుర్తు చేశారు. -
6న కలుద్దాం.. చంద్రబాబుకు రేవంత్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం పక్షాన ఈనెల ఆరో తేదీన ముఖాముఖి కలుద్దామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఆహ్వనించారు. 6వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా పూలే భవన్లో కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు చంద్రబాబుకు రేవంత్ లేఖ రాశారు. ‘మీరు ఈనెల ఒకటో తేదీన లేఖ రాసినందుకు కృతజ్ఞతలు.ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు మీకు అభినందనలు. నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడం ద్వారా మీరు దేశంలోనే అరుదైన నాయకుల్లో ఒకరిగా నిలిచారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించేందుకు నన్ను కలవాలన్న మీ ప్రతిపాదనతో నేను ఏకీభవిస్తున్నాను. పునరి్వభజన చట్టంలోని అంశాల పరిష్కారానికి మన భేటీ ఉపయోగపడుతుంది. అవసరం కూడా. వ్యక్తిగతంగా కలవడం పరస్పర సహకారానికి బలమైన పునాది వేస్తుంది. అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించగలం..’అని ఆ లేఖలో రేవంత్ పేర్కొన్నారు. -
అధికారంలోకి వస్తే 15 ఏళ్లు మనమే!: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే మరో 15 ఏళ్లు కొనసాగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు ధీమా వ్యక్తం చేశారు. మరో రెండేళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరిగే అవకాశముందని, మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్ తరఫున ఎవరికి బీ ఫామ్ దక్కినా గెలుపు ఖాయమన్నారు. కేసీఆర్ మంగళవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జెడ్పీ చైర్మన్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. వారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు ‘తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉంది. తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. పార్టీ నేతలకు సమన్వయంతో పాటు ఓపిక అవసరం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. త్వరలో అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు సోషల్ మీడియా విభాగాన్ని కూడా పటిష్టంగా తయారు చేస్తాం. పార్టీ నాయకులను సృష్టిస్తుంది.. నాయకులు పార్టీని సృష్టించరు. భవిష్యత్తులో సమర్ధవంతమైన యువ నాయకత్వాన్ని తయారు చేస్తాం. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. నాలుగు రోజులు పదవులు లేకపోతే ఉండలేరా? అని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ప్రజా జీవితంలో అడుగు పెట్టిన తర్వాత అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేసే వారే నిజమైన రాజకీయ నాయకులు..’అని స్పష్టం చేశారు. పిచ్చి పనులు కాంగ్రెస్కు అలవాటే ‘ప్రజలతో ఛీత్కారాలు పొందే లక్షణం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చి పనులు చేయడం కూడా వారికి అలవాటే. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత 1989లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇదే రీతిన వ్యవహరించింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలు సవ్యంగా పనిచేయగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు, తాగునీరు, శాంతిభద్రతల సమస్యలు రావడం బాధ కలిగిస్తోంది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని చెప్తున్నవారు తెచ్చిన తెలంగాణను కూడా చెరిపివేస్తారా? వైఎస్ రాజశేఖర్రెడ్డి అమలు చేసిన ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్మెంటు పథకాలను పేర్లు మార్చకుండా నేను కొనసాగించా. వ్యవసాయ స్థిరీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధుకు ఎగనామం పెట్టే ప్రయత్నం జరుగుతోంది. సాగు లెక్కలు, ఇతరత్రా కారణాలు పరిగణనలోకి తీసుకుంటే రైతుబంధు అమల్లో అవినీతి మొదలవుతుంది..’అని మాజీ సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో జెడ్పీ చైర్మన్ల కీలక పాత్ర జెడ్పీ ఛైర్మన్లు రాష్ట్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషించారని కేసీఆర్ ప్రశంసించారు. పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జెడ్పీ చైర్మన్లు కుటుంబ సభ్యులతో సహా ఈ భేటీకి హాజరు కాగా, కేసీఆర్ వారిని పేరు పేరునా పలుకరించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్లకు జ్ఞాపికలతో పాటు యాదాద్రి ప్రసాదాన్ని కేటీఆర్ అందజేశారు. ఈ భేటీలో మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జి.జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్రెడ్డి, బాల్క సుమన్, గండ్ర వెంకట రమణారెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నాయకులు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వంటేరు ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్లు జనార్దన్ రాథోడ్ (ఆదిలాబాద్), కోరిపెల్లి విజయలక్ష్మి (నిర్మల్), దాదన్నగారి విఠల్ రావు (నిజామాబాద్), దఫేదార్ శోభ (కామారెడ్డి), దావా వసంత సురేష్ (జగిత్యాల), పుట్టా మధుకర్ (పెద్దపల్లి), కనుమళ్ల విజయ (కరీంనగర్), న్యాలకొండ అరుణ (రాజన్న సిరిసిల్ల), పటోళ్ల మంజుశ్రీ (సంగారెడ్డి), ర్యాకల హేమలత (మెదక్), వేలేటి రోజారాణి (సిద్దిపేట), శాంతకుమారి (నాగర్ కర్నూల్), బండా నరేందర్ రెడ్డి (నల్లగొండ), గుజ్జ దీపిక (సూర్యాపేట), ఎలిమినేటి సందీప్ రెడ్డి (యాదాద్రి భువనగిరి), ఆంగోత్ బిందు (మహబూబాబాద్), గండ్ర జ్యోతి (వరంగల్ రూరల్), మారపల్లి సు«దీర్ కుమార్ (వరంగల్ అర్బన్), జక్కు శ్రీహర్షిణి (జయశంకర్ భూపాలపల్లి ), బడే నాగజ్యోతి (ములుగు), లింగాల కమల్ రాజ్ (ఖమ్మం) హాజరయ్యారు. -
మరో మంత్రి పదవి!
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరో మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. ఈ నెల 4వ తేదీన జరిగే మంత్రివర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి పదవి దక్కనుందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రాజగోపాల్రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. పలు సందర్భాల్లో తన మనసులోని మాటను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు.. ఎంపీ ఎన్నికల్లో అన్ని బాధ్యతలు తానే తీసుకొని చామల కిరణ్కుమారెడ్డిని భువనగిరి ఎంపీగా గెలిపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తీన్మార్ మల్లన్న గెలుపునకు కృషి చేసిన రాజగోపాల్రెడ్డి.. రెండు రోజుల క్రితం డీసీసీబీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించి సీఎం రేవంత్రెడ్డి అభిమానాన్ని చూరగొన్నారు.లైన్ క్లియర్ అయినట్లేనా..ఎంపీ ఎన్నికలు పూర్తయిన వెంటనే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేలా గతంలోనే అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే భువనగిరి ఎంపీగా తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయించాలని చెప్పినా అందుకు ఆయన అంగీకరించలేదన్న చర్చ అప్పట్లో జరిగింది. పార్టీ సర్వేల ప్రకారం ఆమె పోటీలో ఉంటే భారీ మెజారిటీతో గెలుస్తారన్న చర్చ సాగడంతో అధిష్టానం లక్ష్మిని పోటీ చేయించాలని రాజగోపాల్రెడ్డిపై ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. అయితే, అటు లక్ష్మిని ఎంపీగా పోటీలో నిలిపి, ఇటు మంత్రి పదవి అడిగితే పార్టీ పరంగా విమర్శలు వస్తాయనే భావనతో లక్ష్మిని పోటీచేయించేందుకు ఆయన ఒప్పుకోలేదు. అంతేకాదు తాము ఎంపీ టికెట్ అడుగడంలేదని, తమ కుటుంబ సభ్యులు ఎవరూ పోటీలో ఉండరని పలు సందర్భాల్లో ఆయన ప్రకటించారు. పార్టీ ఎవరిని బరిలో నిలిపినా భారీ మెజారిటీతో గెలిపించి తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రతిపాదన మేరకు అధిష్టానం చామల కిరణ్కుమార్రెడ్డిని భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించించింది. ఆ ఎన్నికల్లో అన్నీ తానై భారీ మెజారిటీతో గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో కేబినెట్ విస్తరణలో ఆయన పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.అమాత్య పదవి వస్తుందని ధీమాలో..అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత రాజకీయ సమీకరణల్లో భాగంగా రాజగోపాల్రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి అధిష్టానం మంత్రి పదవిని కట్టబెట్టింది. తరువాత తనకు మంత్రి పదవి వస్తుందని అసెంబ్లీ సమావేశాల సందర్భంలోనూ రాజగోపాల్రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ఎన్నికల తరువాత విస్తరణ ఉంటుందని పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈసారి తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో రాజగోపాల్రెడ్డి ఉన్నారు.మంత్రి పదవిపై ముగ్గురి ఆశలు?ఉమ్మడి జిల్లా నుంచి రాజగోపాల్రెడ్డితో పాటు మరో ఇద్దరు మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. లంబాడా కోటాలో తనకు మంత్రి పదవి కావాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి కూడా తన సతీమణి పద్మావతి రెడ్డికి మంత్రి పదవి అడుగుతున్నట్లు తెలిసింది. అయితే, అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కేబినెట్లో బెర్త్ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి మూడో మంత్రి పదవిని కూడా రెడ్డి సామజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వక తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.ముచ్చటగా మూడు..!కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి వస్తే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు అవుతారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి, భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రిగా నలమాద ఉత్తమ్కుమార్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి అవకాశం కల్పించారు. ఇప్పుడు రాజగోపాల్రెడ్డికి కూడా మంత్రి పదవి వస్తే ఉమ్మడి జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కినట్లు అవుతుంది. -
చంద్రబాబు లేఖ.. రేవంత్ రిప్లై..
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 6న భేటీకి సిద్ధమని సీఎం రేవంత్ తెలిపారు. ప్రజాభవన్లో భేటీకి రావాలని లేఖలో రేవంత్ ఆహ్వానించారు. విభజన సమస్యల పరిష్కారం కోరుకుంటున్నామని రేవంత్ పేర్కొన్నారు.కాగా, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కలిసి చర్చించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి ఆయన లేఖ రాశారు.తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా రెండు రాష్ట్రాల అభివృద్ధికి, సంక్షేమానికి పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరముందని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, రెండు రాష్ట్రాల లక్ష్యాలను సాధించడానికి సమన్వయంతో పనిచేయాల్సి వుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయని చంద్రబాబు ఈ సందర్భంగా ఆ లేఖలో గుర్తుచేశారు. -
బీఆర్ఎస్ను వీడుతున్నవారిపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,గజ్వేల్: పార్టీ పవర్లో ఉన్నపుడు అత్యున్నత పదవులు అనుభవించి ప్రస్తుతం పార్టీని వీడుతున్న నాయకులపై బీఆర్ఎస్ అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడుతున్న వారు నాలుగు రోజులు పదవులు లేకపోతే ఉండలేరా? వారిని చూసి ప్రజలు అసహించుకుంటున్నారన్నారు.ఎర్రవెల్లి ఫాంహౌజ్లో మంగళవారం(జులై2) జరిగిన పార్టీ జెడ్పీచైర్మన్ల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారన్నారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వంలో జెడ్పీచైర్మన్లందరూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు. భవిష్యత్తులో మీరంతా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.ప్రజా జీవితంలోకి ఒకసారి వచ్చిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పని చేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నీ సవ్యంగా నడిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు , తాగు నీటి ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి. మతకల్లోలాలు కూడా చెలరేగడం బాధ కలిగిస్తోంది. అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నారు. అయినా శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తున్నదో ఆలోచించాలి. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించింది. పార్టీ నాయకులను సృష్టిస్తుంది కానీ నాయకులు పార్టీని సృష్టించరు. మంచి యువనాయకత్వాన్ని తయారు చేస్తున్నాం’అని కేసీఆర్ చెప్పారు. -
నాడు మీరు పార్టీలో చేర్చుకోలేదా?.. కేటీఆర్కు ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్
సాక్షి, జగిత్యాల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అలాగే, తనపై విమర్శలు చేసిన వారే ఏం జరిగిందో ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని కౌంటరిచ్చారు. అలాగే, జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ చేరినట్టు వెల్లడించారు.కాగా, సంజయ్ కుమార్ మంగళవారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. నేను బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కనీసం ఒక్క కౌన్సిలర్గా కూడా లేని పరిస్థితిలో ఉన్నాను. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టడానికి ఎవరూ ముందుకు రాకపోతే మా బంధువులతో కట్టించాను. నన్ను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాను. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాను. కేటీఆర్ మాటలు నన్ను బాధించాయి. విమర్శలు చేసిన వారే ఏం జరిగిందో ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి. గతంలో వేరే పార్టీలో గెలిచినవారిని మీరెలా(బీఆర్ఎస్) చేర్చుకోన్నారో ముందు సమాధానం చెప్పాలి. జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం. నేను ఒక డాక్టర్ను చాలా కుటుంబాలను పోషించేంత ఆర్థికంగా ఉన్నవాడిని. జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే కాంగ్రెస్లో చేరాను. మా కుటుంబం అంతా కాంగ్రెస్లోనే ఉన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి నడిస్తే అభివృద్ధి సాధ్యమని భావించాను. రైతుల కోసం రుణమాఫీ చేయడానికి ప్రక్రియ ప్రారంభించారు సీఎం రేవంత్. తెలంగాణాలో ఎక్కడా లేని విధంగా జగిత్యాలలో డబుల్ బెడ్ రూమ్స్ కట్టించాం. దీనికి సంబంధించిన డబ్బులు పెండింగ్లో ఉన్నాయి’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. సంజయ్ కుమార్ ఇటీవలే సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ బీ-ఫామ్తో ఎన్నికల్లో గెలిచిన సంజయ్.. పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్లో చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే సంజయ్పై కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంలో బీఆర్ఎస్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. -
ప్రజాపాలన అంటే ప్రజలు ఉండరా?: హరీష్ రావు కౌంటర్
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. తెలంగాణలో పాలన పడకేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజా ప్రభుత్వం అని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.కాగా, హరీష్ రావు మంగళవారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయి. రాష్ట్రంలో ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని చెబుతున్నారు. మరి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు. ఏడు నెలలుగా వారికి జీతాలు ఇవ్వలేదు. వారి కుటుంబాలు ఎలా బ్రతుకుతాయి. పల్లెలు ఎలా నడవాలి.చివరకు సర్పంచ్లు వెళ్లి గవర్నర్ను కలిశారు. బిల్లుల విషయంలో సర్పంచ్లు కన్నీళ్లుపెట్టుకుంటున్నారు. ఇదీ మీ ప్రభుత్వ పనితీరు. గ్రామపంచాయతీల్లో డబ్బులు లేక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ప్రజాపాలన అంటే పాలనలో ప్రజలు ఉండరా?. ప్రతీ రోజు జరిగే శానిటేషన్ కూడా చేయడం లేదు. వానాకాలంలో తీసుకునే చర్యలు ఏవీ కూడా తీసుకోవడం లేదు. ప్రజలు వాధ్యుల బారినపడితే ఎవరిది బాధ్యత. బీఆర్ఎస్ హయాంలో ప్రతీ నెల రూ.275 కోట్లు ఇచ్చాము. కచ్చితంగా నిధులను ఇవ్వడం జరిగింది. ప్రజా ప్రభుత్వంలో ఎందుకు నిధులు ఇవ్వడం లేదు. మా కన్నా మీరు బాగా చేస్తారని మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ, మీరు చేసిందేమీలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. -
తెలంగాణ సీఎం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదా?
రాజకీయ నేతలు ఒక్కోసారి తాము మాట్లాడేది తమకే తగులుతుందన్న సంగతి మర్చిపోతుంటారు. ఎదుటివారిపై నోరు పారేసుకోవడంలో ఉత్సాహం చూపే క్రమంలో తమకే నష్టం చేసుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు అలాగే ఉన్నాయి. తాను కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నట్లు రేవంత్ అనుకోవడం లేదు. ఇంకా టీడీపీలోనే ఉన్నట్టుగా... ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత విధేయుడినన్నట్లే వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు మాదిరి రాజకీయాలలో రేవంత్ కూడా అదృష్టవంతుడే. దాన్ని ఆయన నిలబెట్టుకుంటే మంచిదే. కానీ అందుకు భిన్నంగా నోటి దురద తీర్చుకుంటున్న వైనం ఆయనకు నష్టం చేస్తుందని చెప్పక తప్పదు.ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ, మంత్రులను, పార్టీ నేతలను అజమాయిషీ చేయలేని నిస్సహాయ స్థితిలో పొరుగు రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడి తృప్తి పడుతున్నారనుకోవాలి. ఫిరాయింపు రాజకీయాలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన ప్రమాణికతను తెలియచేస్తుంది. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓడిపోవడంపై రేవంత్ రెడ్డి అతిగా స్పందించారు. ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికు గుణపాఠం చెప్పారని ఆయన అంటున్నారు. ప్రత్యర్ధులపై కక్షకట్టి పాలనను విస్మరించారని, టీడీపీని ఖతం చేయాలని పగబట్టారని, చివరికి సొంత పార్టీనే ఖతం చేసుకున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. మనం చేసిన పాపాలు ఏదో నాడు మనల్నే మింగేస్తాయి అని ఆయన ప్రవచనాలు వల్లించారు. వీటిలో దాదాపు అన్నీ ఆయనకు, ఆయన ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న పార్టీకే వర్తిస్తాయి.అంతకన్నా ముందుగా రేవంత్ ఒక విషయాన్ని గుర్తించాలి. తెలుగుదేశం ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉంది. అయినా రేవంత్ ఆ పార్టీకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ఇస్తున్నారు. తద్వారా తన నైజాన్ని బయట పెట్టుకుంటున్నారు. అది కరెక్టా? కాదా? అన్నది ఆయన, కాంగ్రెస్ అధిష్టానం తేల్చుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికు జనం గుణపాఠం చెప్పారని అంటున్న రేవంత్ గత పదేళ్లలో రెండు ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయింది కదా! అనేదానికి తన విశ్లేషణ చెబుతారా! పలు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయింది కదా! అయినా అదృష్టం కలిసి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది.అంతెందుకు కొడంగల్ లో 2018లో ఆయనే ఓటమి పాలయ్యారు కదా! అంటే అప్పుడు ఆయనకు ప్రజలు పాఠం చెప్పారని అంగీకరిస్తారా? తను చేసిన పాపం వల్లే అప్పుడు ఓడిపోయానని అంటారా! ఈ విషయాన్ని పక్కనబెడితే మరో సంగతి చూద్దాం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉండేది కదా. ప్రస్తుతం మూడు రాష్ట్రాలకే పరిమితం అయ్యిందంటే ఆ పార్టీ చేసిన పాపాల వల్లే మునిగిపోయిందా! గత మూడు టరమ్ లుగా దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోతోంది కదా! అంటే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితరులు చేసిన పాపాలే కాంగ్రెస్ ను మింగేశాయని రేవంత్ చెప్పదలిచారా!అలాగే, ఒకప్పుడు రెండు లోక్ సభ సీట్లతో ఉన్న బీజేపీ నిరాఘాటంగా మూడు దఫాలుగా పాలన చేస్తున్నది కదా! అలాగే ఏపీలో నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రాకూడదని ఏమైనా ఉందా? 2019లో కేవలం ఇరవై మూడు సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఈసారి జనసేన, బీజేపీలతో ప్రత్యక్షంగాను, కాంగ్రెస్, సీపీఐలతో పరోక్షంగానూ జతకట్టి అధికారంలోకి వచ్చింది కదా! చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం మూడుసార్లు ఓటమి చెందింది. అంటే ఆ మూడుసార్లు పాపాలు మూట కట్టుకోవడం వల్లే టీడీపీ ఓడిపోయిందని రేవంత్ చెబుతున్నారా! టీడీపీని ఖతం చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నారట.రేవంత్ ఎలా అబద్దం చెబుతున్నారో చూడండి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వైఎస్సార్సీపీని ఖతం చేయాలని ప్రయత్నించడం పగ పట్టినట్లు కాదట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేయకపోయినా ఖతం చేసినట్లట. ఆ మాటకు వస్తే తెలంగాణలో పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం పార్టీ ఎందుకు ఖతం అయింది? ఓటుకు నోటు కేసు ద్వారా చంద్రబాబుతోపాటు రేవంత్ కు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లే కదా! టీడీపీని ఖతం చేసిన తర్వాత రేవంత్ కాంగ్రెస్ లో చేరిపోయారే!. ఇంకో విషయం చూద్దాం. రేవంత్ రెడ్డి సొంత ప్రాంతం అయిన మహబూబ్ నగర్ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయింది. అక్కడ బీజేపీ గెలిచింది. అలాగే 2019లో తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో సైతం ఈసారి బీజేపీ గెలిచింది. దీనికి నైతికంగా రేవంత్ బాధ్యత వహించారా? ఆయన ఏ పాపం చేస్తే ఈ రెండుచోట్ల ఇలా జరిగింది. కొడంగల్తోపాటు కామారెడ్డిలో శాసనసభకు పోటీచేసిన రేవంత్ కొడంగల్ లో గెలిచినా, కామారెడ్డిలో ఓడిపోవడమే కాకుండా మూడోస్థానానికే ఎందుకు పరిమితం అయ్యారు? ముఖ్యమంత్రి కాండిడేట్ కు అది అవమానం కాదా! తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ ను ఖతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న రేవంత్ ఏపీ రాజకీయాలలో తలదూర్చి నీతులు చెబుతున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య.. ఇలా ఎవరు దొరికితే వారిని కాంగ్రెస్ లోకి లాక్కొని ముఖ్యమంత్రి హోదాలో స్థిరపడాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు! గతంలో ఇదే రేవంత్ ఫిరాయింపులు చేసేవారిని రాళ్లతో కొట్టాలని అన్నారు కదా? ఇప్పుడేమో ప్రభుత్వ సుస్థిరతకు ఇతర పార్టీల నుంచి చేరికలు అవసరమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఫిరాయింపు రాజకీయాలు చేసిన కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని, క్షమాపణలు చెప్పాలని నీతి వాక్యాలు చెప్పారు. బాగానే ఉంది. మరి అదే పని ఇప్పుడు ఆయన కూడా చేస్తున్నారే. భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్ అధికారం కోల్పోతే అప్పుడు ఈయన ముక్కు నేలకు రాస్తారా! రేవంత్ ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రిపైన అయినా అజమాయిషీతో ఉండగలుగుతున్నారా!జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ లోకి తెచ్చినప్పుడు పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇచ్చిన జెర్క్ కు రేవంత్ ఎందుకు భయపడ్డారు. ఆయన పార్టీ నుంచి పోతే పోయారులే అని అనుకుని ఊరుకోకుండా తప్పు ఎందుకు ఒప్పుకున్నారు! ప్రత్యర్ధులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టారని రేవంత్ అంటున్నారు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసులు వస్తే అవన్ని సక్రమం, తన గురువు అయిన చంద్రబాబుపై అవినీతి కేసులు వస్తే అవన్ని కక్ష అని ఆయన చెబుతున్నారన్నమాట.ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలపై జ్యుడిషియల్ కమిషన్ లు ఎందుకు వేశారు? అవి కక్ష కిందకు రావా! ఆయా కేసుల్లో తమ నేతలను ఇరికించడానికి ప్రభుత్వం యత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రేవంత్ కూడా తన గురువు చంద్రబాబు స్టైల్ లోనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు తాను ఏమి చేసినా, ఏమి మాట్లాడినా అదంతా కరెక్టు అని, అదే పని తన ప్రత్యర్ధులు చేస్తే, అవే మాటలు వారు మాట్లాడితే మాత్రం పెద్ద ఎత్తున దూషణలకు దిగుతుంటారు.సరిగ్గా అదే తరహాలో రేవంత్ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. చంద్రబాబు మాదిరే తాను కూడా ఎన్ని మాటలు మార్చినా ప్రజలను ఏమార్చవచ్చని అనుకుంటే అది పొరపాటు. ఏపీ రాజకీయాలలో వేలు పెట్టి చంద్రబాబుకు మేలు చేయాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిను దూషించడం ద్వారా రేవంత్ రెడ్డి తనకు తానే నష్టం చేసుకున్నవారు అవుతారు. ఆ సంగతి అర్ధం అవడానికి రేవంత్ కు మరికొంత కాలం పట్టవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మీ ఏడుపే మా ఎదుగుదల.. కేటీఆర్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్కు ఎంత చాలా ప్రాధాన్యత ఇచ్చింది. మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా, యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. గోదావరి జలాలను రైతులకు అందించారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్పై తాజాగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. మా కరువులకు కన్నీళ్ల కుశాశ్వత పరిష్కారం కాళేశ్వరం.!తెలంగాణ తెర్లై పోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకుఈర్ష్య అసూయ పుట్టించి.. కన్నుకుట్టించిన మా వరప్రదాయిని కాళేశ్వరం!తలాపున గోదారి గలగల పారుతున్నతనువంతా ఎడారై ఎండిన శాపానికివిమోచనం కాళేశ్వరం!సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న మా చేను చెలకలు నదీ జలాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యం..!దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన గోదారి జలాల సాధన పోరాటాలకు సమాధానం కాళేశ్వరం!శిథిల శివాలయంగా పాడుబడిపోయినశ్రీరామ్ సాగర్ కు పునరుజ్జీవమిచ్చినపుణ్య వరం కాళేశ్వరం!నీళ్లు రాక..ఒట్టిపోయిన నిజాంసాగర్ కునిండుకుండలా మార్చే అండ దండ కాళేశ్వరం!మండుటెండల్లో చెరువులను మత్తళ్లుదూకించిన మహత్యం కాళేశ్వరం!మా తపనకు..ఆలోచనకు ..అన్వేషణకుజలదౌత్యానికి... నిదర్శనం కాళేశ్వరం..!కాళేశ్వరం అంటే ఒక్క బరాజ్ కాదని తెలియని మీ అజ్ఞానం!ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజంసరిదిద్దుకోగలం...!రాజకీయ కుళ్ళు కుతంత్రాలను దిష్టి చూపులను తట్టుకోగలం..!మీ ఏడుపే మా ఎదుగుదల..!#KaleshwaramProject అని కామెంట్స్ చేశారు. మా కరువులకు కన్నీళ్ల కుశాశ్వత పరిష్కారం కాళేశ్వరం.!తెలంగాణ తెర్లై పోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకుఈర్ష్య అసూయ పుట్టించి.. కన్నుకుట్టించిన మా వరప్రదాయిని కాళేశ్వరం!తలాపున గోదారి గలగల పారుతున్నతనువంతా ఎడారై ఎండిన శాపానికివిమోచనం కాళేశ్వరం!సముద్ర…— KTR (@KTRBRS) July 2, 2024 -
తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఆ జిల్లా నుంచి ముగ్గురికి కీలక పదవులు!
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో చెప్పిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల నాలుగో తేదీన మరి కొంత మందిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశముందని సమాచారం.మంత్రివర్గ కూర్పు గురించి రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు మరోసారి పిలుపు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీ వెళ్లనున్నారు.కాగా, అధిష్టానం ఇచ్చిన సమయాన్ని బట్టి మంగళవారం లేదా బుధవారం వారు హస్తిన చేరుకుంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన తుది జాబితాకు ఆమోదముద్ర వేస్తారని, తుది దఫా చర్చల్లో భాగంగా ఇప్పటివరకు స్పష్టత రాని ఒకట్రెండు బెర్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇదిలా ఉండగా.. మంత్రి వర్గంలోకి మరో ఆరుగురికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు బీసీ, ఒక మైనార్టీ, ఇద్దరు ఓసీ, ఒక ఎస్టీకి కేబినెట్లో ఛాన్స్ దక్కనున్నట్టు సమాచారం. మరోవైపు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలకు కీలక పదవులు ఇస్తారనే టాక్ నడుస్తోంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం.అలాగే, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ పదవి రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఇక, ఇటీవలే కాంగ్రెస్లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్కు వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ పదవి ఇచ్చే యోచనలో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ను పటిష్టం చేసేందుకే పదవులు ఇస్తున్నారనే చర్చ నడుస్తోంది. -
దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు: కేటీఆర్
జగిత్యాల: ‘సీఎం రేవంత్రెడ్డి.. నీకు దమ్ముంటే నువ్వు తీసుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. వారిని మళ్లీ గెలిపించుకుంటేనే దమ్మున్నోడివి’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. జగిత్యాలలోని పద్మనాయక కల్యాణ మండపంలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సిగ్గులేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. 2014లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రస్తుత సీఎం ప్రయతి్నంచి రూ. 50 లక్షలతో రెడ్హ్యాండెడ్గా దొరికారని, ఆ పరిస్థితుల్లోనే రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారని గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలా బీఆర్ఎస్ ఎప్పుడూ వ్యవహరించలేదని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరితే రాళ్లతో కొట్టి చంపాలని స్వయంగా రేవంత్రెడ్డే వ్యాఖ్యానించారని, ఇప్పుడు ఎవరిని రాళ్లతో కొట్టాలో ఆయనే చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారి సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దయ్యేలా రాజ్యాంగ సవరణ చేస్తామంటూ స్వయంగా రాహుల్గాంధీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేసింది కేసీఆరేనని.. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదని స్పష్టం చేశారు. 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో సీఎం రేవంత్రెడ్డి ఎమ్మెల్యేలను చేర్చుకొనే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కార్యకర్తలు, నాయకులు అధైర్యపడొద్దని, మళ్లీ పార్టీకి మంచిరోజులు వస్తాయని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు బాజిరెడ్డి గోవర్దన్, నారదాసు లక్ష్మణ్రావు పాల్గొన్నారు. నిరుద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలన్నారు. డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ హక్కుల కోసం దీక్ష చేస్తున్న మోతీలాల్ అనే యువకుడికి సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన నిరుద్యోగ యువకులపై లాఠీచార్జి చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అలాగే తమ పార్టీ నేతలను అడ్డుకోవడంపై మండిపడ్డారు. ప్రజాపాలనలో పరామర్శించే, నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. -
కలిసి మాట్లాడుకుందాం
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కలిసి చర్చించుకుందామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆయన లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా రెండు రాష్ట్రాల అభివృద్ధికి, సంక్షేమానికి పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరముందని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, రెండు రాష్ట్రాల లక్ష్యాలను సాధించడానికి సమన్వయంతో పనిచేయాల్సి వుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయని చంద్రబాబు ఈ సందర్భంగా ఆ లేఖలో గుర్తుచేశారు.ఈ నేపథ్యంలో.. పునర్వ్యవస్థీకరణ చట్టంవల్ల ఎదురవుతున్న సమస్యలపై ఇప్పటికే అనేక చర్చలు జరిగాయని, ఇవన్నీ సంక్షేమం, పురోగతిపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయన్నారు. ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి సామరస్యంగా ముందుకెళ్లడం అత్యవసరమని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసం ఈనెల 6వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్లో కలుద్దామని రేవంత్రెడ్డికి ఆయన ప్రతిపాదించారు. ముఖాముఖి సమావేశం నిర్వహించుకుని క్లిష్టమైన సమస్యలపై సమగ్రంగా చర్చలు జరుపుదామన్నారు. ఏపీ, తెలంగాణకు పరస్పర ప్రయోజనం కలిగే పరిష్కారాలను కనుగొని అందుకనుగుణంగా సమన్వయంతో పనిచేయడానికి ఈ చర్చలు ఉపయోగపడతాయని వివరించారు. -
ఎల్లుండే తెలంగాణ కేబినెట్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో చెప్పిన నేపథ్యంలో.. ఈ నెల 4న మరికొంత మందిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశముందని సమాచారం. ఈ మేరకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం సోమవారం రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో భేటీ కావడాన్ని కూడా ప్రస్తావిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ గురించి గవర్నర్కు రేవంత్ చెప్పారని, 4న అందుబాటులో ఉండాల్సిందిగా కోరారని తెలుస్తోంది. రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్గా, పుదుచ్చేరి ఇన్చార్జి లెఫ్టినెంట్ గవర్నర్గా సైతం వ్యవహరిస్తుండడంతో ఈ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. మంత్రివర్గ కూర్పు గురించి రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు మరోమారు పిలుపు వచ్చింది. సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డిలు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానం ఇచ్చిన సమయాన్ని బట్టి మంగళ లేదా బుధవారం వారు హస్తిన చేరుకుంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన తుది జాబితాకు ఆమోదముద్ర వేస్తారని, తుది దఫా చర్చల్లో భాగంగా ఇప్పటివరకు స్పష్టత రాని ఒకట్రెండు బెర్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, పి.సుదర్శన్రెడ్డి, వాకిటి శ్రీహరిల పేర్లు దాదాపు ఖరారయ్యాయని, ప్రేంసాగర్రావు, వివేక్లలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ దఫా నాలుగు బెర్తులు భర్తీ చేస్తారని, ముస్లిం మైనారీ్టల కోసం ఒక బెర్తు, ఎస్టీల కోసం మరో బెర్తును ఖాళీగా ఉంచవచ్చని తెలుస్తోంది. ఢిల్లీలో చర్చల అనంతరం ఈ విషయంలో మరింత స్పష్టత రానుంది. నాలుగో వారంలో బడ్జెట్ భేటీ! సీఎం రేవంత్రెడ్డి సోమ వారం మధ్యాహ్నం రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో దాదాపుగా రెండు గంటల పాటు భేటీ అయ్యారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. కాగా సీఎం పలు అంశాలను గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణతోపాటు ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించినట్టు తెలిసింది. ఈ నెల 22న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన పక్షంలో 23, 24 తేదీల్లో..ఒకవేళ 23న కేంద్రం బడ్జెట్ పెట్టినట్లైతే 24 లేదా 25 తేదీల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని, ఇందుకు అనుగుణంగా అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ అవుతుందని సమాచారం. -
కాంగ్రెస్లోకి బస్వరాజు సారయ్య?
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘ఆపరేషన్ ఆకర్ష్’పై మళ్లీ ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తిరిగి సొంతగూటికి చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటికే రామసహాయం సురేందర్రెడ్డిని కలిసిన ఆయన.. గత నెల 29న సీఎం రేవంత్ రెడ్డి సమీక్షకు హాజరై ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సంప్రదింపులు చేసినట్లు చర్చ జరుగుతోంది. బస్వరాజు సారయ్యతోపాటు మండలి వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్రావులపైన సోమవారం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సీఎం రేవంత్రెడ్డికి పుష్పగుచ్ఛం ఇస్తున్న బండా ప్రకాశ్ ఫొటో చక్కర్లు కొట్టింది. అయితే దీనిపై వేర్వేరుగా స్పందించిన బండా ప్రకాశ్, తక్కళ్లపెల్లి రవీందర్రావులు తమపై జరుగుతున్న తప్పుడు ప్రచారంగా కొట్టిపారేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఎమ్మెల్సీ రవీందర్రావు స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశాల సందర్భంగా కర్టసీగా సీఎంను కలిసిన ఫొటోలను తాజా ఫొటోలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ప్రకాశ్ పేర్కొన్నారు.ఎమ్మెల్సీల్లో ఓరుగల్లుకు బీఆర్ఎస్ పెద్దపీట...గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవుల్లో ఉమ్మడి వరంగల్కు పెద్దపీట వేశారు. ఎనిమిది మంది సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో, పార్టీ ప్రస్థానంలో వెన్నుదన్నుగా ఉన్న ఈ జిల్లాకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించారు. సత్యవతి రాథోడ్, బస్వరాజు సారయ్య, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, కడియం శ్రీహరి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, డాక్టర్ బండా ప్రకాశ్, సిరికొండ మధుసూదనాచారిలకు వివిధ కేటగిరీల కింద ఎమ్మెల్సీలుగా చాన్స్ దక్కింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపొందడంతో రాజీనామా చేయగా, ఆయన స్థానానికి జరిగిన ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న(కాంగ్రెస్) ఇటీవలే గెలిచారు. ఎమ్మెల్సీగా ఉండి స్టేషన్ఘన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కడియం శ్రీహరి సైతం గెలుపొందినా.. ఆయన కూడా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సంఖ్య ఆరుకు తగ్గింది. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలలో కలిసొచ్చే వారిపై కాంగ్రెస్ గురి పెట్టడం చర్చనీయాంశమవుతోంది.బీఆర్ఎస్కు గట్టి షాకేనా..?నేతల వలసలతో ఇప్పటికే సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి వరంగల్లో మరో షాక్ తగిలేలా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపైన కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే బస్వరాజు సారయ్య కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం అదే దారిలో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత నెల 29న సీఎం రేవంత్ వరంగల్ పర్యటన సందర్భంగా ఆయన సలహాదారు వేం నరేందర్రెడ్డితో సారయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చేరికలపై చర్చించారన్న ప్రచారం జరిగింది. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డిని కలిసిన సందర్భంగా రెండు నెలల క్రితమే సారయ్య కాంగ్రెస్లో చేరుతారని భావించారు. అయితే ఆయనతోపాటు ఒకేసారి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం, సీఎం భావించి బ్రేక్ వేశారన్న ప్రచారం కూడా సాగింది. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై ఎమ్మెల్సీ సారయ్య కూడా స్పష్టత ఇచ్చారు. డాక్టర్ బండా ప్రకాశ్, రవీందర్ రావు మాత్రం ప్రచారాన్ని ఖండిస్తున్నారు. -
నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఏవి?
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, 7 నెలలైందని, హామీల అమలు మాత్రం నీటిమూటగా మిగిలిపోయందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఎంత వరకు వచ్చిందని, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయని ప్రశ్నించారు.ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భతి రూ.4,000 ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇస్తామని, కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటర్లు ఇస్తామన్న హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. గత ప్రభుత్వంలో విడుదల చేసిన నోటిఫికేషన్కు మాత్రం కొన్ని పోస్టులు కలుపుతూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.మాజీ సీఎం కేసీఆర్ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై న అభ్యర్థులకు సీఎం రేవంత్రెడ్డి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి, నియామక పత్రాలు ఇచ్చి, నిరుద్యోగుల చెవులో పూలు పెట్టారన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో 1.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు.నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ను పరామర్శించేందుకు గాంధీ హాస్పిటల్కు వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాకేశ్ రెడ్డితోపాటు పలువురు విద్యార్థి ఉద్యమ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. -
తెలంగాణ కేబినెట్ విస్తరణపై మంత్రి దామోదర కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణపై మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న దామోదర.. శాఖల మార్పులు, చేర్పులు తప్పక ఉంటాయన్నారు. ఈ కేబినెట్ విస్తరణలో సీతక్కకు హోంమంత్రి పదవి దక్కే చాన్స్ ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇక దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రి దక్కే చాన్స్ ఉందన్నారు. -
గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే.. ఎమ్మెల్యే సంజయ్కు కేటీఆర్ చురకలు
సాక్షి, జగిత్యాల: గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను ఉద్ధేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలకు పట్టిన శని పోయిందని నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు మనషుల విలువ తెలుస్తుందని తెలిపారు. గాలికి గడ్డపారలు కొట్టుకుపోవు. గట్టి నాయకులు కొట్టుకుపోరని అన్నారు. గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమేనని తెలిపారు.కార్యకర్తలు ఎమ్మెల్యేను తయారు చేశారు కానీ.. ఎమ్మెల్యే, కార్యకర్తలను తయారు చేయలేదని తెలిపారు. వేల మంది కష్టపడితే ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇప్పుడు దొంగల్లో కలిశాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతులకు ఆశపడి పోయిండని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే బుద్ది ఇవాళ తెలిసి వచ్చిందన్నారు.‘అభివృద్ధి కోసం పోయినా అని సంజయ్ అన్నాడు. జగిత్యాల జిల్లా రద్దు చేస్తా.. మెడికల్, నర్సింగ్ కాలేజీ రద్దు చేస్తా అని రేవంత్ రెడ్డి అన్నందుకు సంజయ్ కాంగ్రెస్లోకి వెళ్లిండా..? రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4500 డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినందుకు రద్దు చేయమని పోయావా..? ఏ అభివృద్ధి ఆశించి పోయిండు సంజయ్. ఆయన పోయింది ఒక్కదాని కోసం..వియ్యంకుడి బిల్లులు రావాలి.. ఆయన క్రషర్ ఆగొద్దని పోయిండు. సొంత అభివృద్ధి కోసం పోయిండు.. జగిత్యాల అభివృద్ధి కోసం పోలేదు. ఎమ్మెల్యే సంజయ్కు దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలి.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది కాంగ్రెస్ పార్టీనే. దేశంలో ఆయారాం, గయారాం సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెసే. దేశంలో ఎన్నో ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని చవిచూశాయి. స్థానిక సంస్థల్లో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి. జగిత్యాల ఎమ్మెల్యే తనకు తానే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు.2014 తర్వాత రేవంత్ రెడ్డి 50 లక్షలతో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికి జైలుకు పోయాడు. మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశాడు. టీడీపీ, బీఎస్పీ నుంచి మూడింట రెండొంతుల మంది మన పార్టీలో రాజ్యాంగబద్ధంగా విలీనం అయ్యారు. మనం రాజ్యాంగాన్ని, చట్టాన్ని తుంగలో తొక్కలేదు. 2014లో టీడీపీ నుంచి 15 మంది గెలిస్తే 10 మంది, బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరు కలిసి బీఆర్ఎస్లో విలీనం అయ్యారు. 2018లో కాంగ్రెస్ నుంచి 18 మంది గెలిస్తే.. 12 మంది చేరారు. రాజ్యాంగబద్దంగా మూడింట రెండొంతుల మంది చేరారు. ఒక్కొక్కరు వచ్చి కండువా కప్పుకోలేదు. ఆ పని కేసీఆర్ చేయలేదు అని కేటీఆర్ వివరించారు.పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలను కుక్కల మాదిరి రాళ్లతో కొట్టి చంపాలని రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడారు. మరి ఇప్పుడు ఎవరు పిచ్చికుక్క.. ఎవర్నీ రాళ్లతో కొట్టిచంపాలి. మీ చెమట, మీ రక్తం ధారపోసి గెలిపించాక పార్టీ ఫిరాయింపులు చేస్తే అలాంటి వారిని రాళ్లతో కొట్టిచంపమని రేవంత్ రెడ్డే చెప్పాడు. మరి ఎవర్నీ పిచ్చి కుక్క మాదిరి కొట్టాలి..? ఎవర్నీ రాళ్లతో కొట్టాల్సిన అవసరం లేదు కానీ.. రేవంత్ రెడ్డి నీవు మొగోడివి అయితే.. నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా.. ఓట్లతో కొట్టి ఆ ఆరుగురిని రాజకీయంగా శ్వాశతంగా సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటది అని కేటీఆర్ స్పష్టం చేశారు.