సాక్షి, ముంబై : ఈశాన్య రాష్ట్రాల వెనుకబాటుతనానికి దేశ రాజధాని న్యూఢిల్లీ కాదని, స్థానిక నాయకుల వైఫల్యమే కారణమని కే్రంద హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజ్యుజీ అన్నారు. దాదర్లోని వీర్సావర్కర్ స్మృతిపథ్ సభాగృహంలో సోమవారం రాత్రి ‘మైహోం ఇండియా’ సామాజిక సంస్థ నిర్వహించిన ‘అవర్ నార్త్ ఈస్ట్ (వన్) ఇండియా అవార్డ్ ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరెన్ మాట్లాడుతూ..స్థానిక నాయకుల ఉదాసీనత కారణంగానే ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాలను భారత దేశం నుంచి విడిగా చూడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.
అయితే తమ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందనీ, ఇటీవల ఈశాన్య రాష్ట్రాలలో రైల్వే ప్రాజెక్టు ప్రారంభించడమే ఇందుకు తార్కాణమని చెప్పారు. ఈశాన్య భారతంలో అద్భుతమైన సహజ వనరులున్నాయనీ వాటిని క్రమపద్ధతిలో సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన ప్రగతిని సాధించ వచ్చని కిరెన్ పేర్కొన్నారు. కాగా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం ఇచ్చే వన్ ఇండియా అవార్డ్- 2014కు గాను ‘శిలాంగ్ టైమ్స్’ ఆంగ్ల దిన పత్రిక సంపాదకురాలు ప్యాట్రీషియా ముఖీంకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహిత మాట్లాడుతూ.. నిజానికి 95 శాతం భారతదేశం సరిహద్దు ఈశాన్య ప్రాంతంలోనే ఉందని చెప్పారు.
ఈ కారణంగా భారత ప్రభుత్వం ఈశాన్య భారతంలో మరింత మౌలిక అభివృద్ధికి కృషి చేయాల్సి ఉందని సూచించారు. మై హోం ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు సునీల్ దేవ్ధర్ మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన కలంతో పోరాడిన ప్యాట్రీషియ ముఖీంకు వన్ ఇండియా అవార్డును ప్రదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి నగర బీజేపీ అధ్యక్షుడు ఆశీష్ శేలార్, వివిధ రంగాలకు చెందిన ఇతర ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు.
స్థానిక నాయకులవల్లే ‘ఈశాన్యం’ వెనుకబాటు
Published Tue, Dec 30 2014 10:17 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement