కునుకు తీస్తూ.. కెమెరాకి చిక్కిన సీఎం | Karnataka Chief Minister Siddaramaiah Dozing Off During Election Rally | Sakshi
Sakshi News home page

కునుకు తీస్తూ.. కెమెరాకి చిక్కిన సీఎం

Apr 30 2018 7:47 PM | Updated on Apr 30 2018 8:15 PM

Karnataka Chief Minister Siddaramaiah Dozing Off During Election Rally - Sakshi

గుల్బర్గా ప్రచార సభలో కునికిపాట్లు తీస్తున్న సిద్దరామయ్య

గుల్బర్గా : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బహిరంగ సమావేశాలంటే.. జోలపాటలా అనిపిస్తాయేమో..! ఇప్పటికే చాలాసార్లు బహిరంగ సమావేశాల్లో కునికిపాట్లు తీస్తూ కన్పించారు. తాజాగా సోమవారం గుల్బర్గాలో నిర్వహించిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార ర్యాలీలో సైతం సిద్ధరామయ్య కునికిపాట్లు పడుతూ మీడియా కంటికి చిక్కారు. ఓ వైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న ఈ సమయంలో సిద్దరామయ్య మాత్రం ఇలా సభల్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా నిద్రలోకి జారుకుంటున్నారు.

ఈ సారి జరగబోయే ఎన్నికలు ఇటు కాం‍గ్రెస్‌కు, అటు బీజేపీకి ఎంతో కీలకంగా మారాయి. పార్టీల మధ్య ప్రచారాల పోరు కూడా తారాస్థాయిలోనే ఉంది. కానీ అక్కడ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా ఉన్న సిద్ధరామయ్య మాత్రం ఈ సారి ఎన్నికలను సీరియస్‌గా తీసుకోకుండా ప్రచార సభల్లోనే నిద్రపోవడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సిద్ధరామయ్య నిద్ర పోవడాన్ని గమనించిన పక్కనే ఉన్న ఓ నాయకుడు చెవి దగ్గర ఏదో చెప్పడంతో నిద్రలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. మళ్లీ వెంటనే నిద్రలోకి జారుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement