వారికోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయండి | For those that want to set up a special center | Sakshi
Sakshi News home page

వారికోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయండి

Jul 25 2015 3:03 AM | Updated on Sep 3 2017 6:06 AM

వారికోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయండి

వారికోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయండి

వికలాంగ విద్యార్థులకు ప్రతి జిల్లాలో ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు సూచించింది

♦ వికలాంగులకు ప్రతి జిల్లాలో కేంద్రం ఏర్పాటు చేయాలన్న బాంబే హైకోర్టు
♦ నిపుణులతో ఓ కమిటీ నియామిస్తూ ఉత్తర్వులు
 
 సాక్షి, ముంబై : వికలాంగ విద్యార్థులకు ప్రతి జిల్లాలో ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు సూచించింది. ఇందుకోసం నిపుణులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ మోహిత్ షా, జస్టిస్ ఎ.కె.మెనన్ వెల్లడించారు. కేం ఆస్పత్రి డాక్టర్లు, నాయర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ హరీశ్ శెట్టి, వైద్య-విద్య పరిశోధన అధికారులు, ప్రజా ఆరోగ్య విభాగ అధికారులు కమిటీలో సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ కమిటీ సభ్యులు జిల్లాల్లో కేంద్రాల ఏర్పాటుకు సాంకేతిక సహాయాన్ని అందజేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నాలుగే కేంద్రాలున్నాయి. అందులో ముంబైలో ఒకటి, పుణేలో ఒకటి ఉన్నాయి.

రాష్ట్రంలో 37,358 మంది వైకల్యం కలిగిన విద్యార్థులు పాఠశాలల్లో చదువుకోడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తేలింది. ఈ ప్రత్యేక కేంద్రాల వల్ల వికలాంగ విద్యార్థులకు సరిఫికెట్ల జారీ వంటి పనులు త్వరగా జరుగుతాయి. వైకల్యం ఉండి చదువుకుంటున్న విద్యార్థుల పరీక్షలు రాయడానికి ఎవరినైనా కేటాయించాలని హెచ్‌ఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ బోర్డులకు కోర్టు సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement