దౌల్తాబాద్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ధర రాలేదని మనస్తాపానికి గురైన ఓ కందిరైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం సూరయపల్లిలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన బిచ్చయ్య(52) కందిపంట సాగు చేశాడు. పండిన పంటను అమ్మడానికి యత్నించగా సరైన ధర రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన బిచ్చయ్య పొలంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కందులకు ధర రాలేదని.. రైతు ఆత్మహత్య
Published Thu, Feb 23 2017 11:53 AM
Related news
-
కాంగ్రెస్లో చేరిన వెంటనే.. ఆ జెడ్పీ చైర్పర్సన్పై బీఆర్ఎస్ అవిశ్వాసం
సాక్షి,రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్రెడ్డిపై 12 మంది జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. శుక్రవారమే ఆమె కాంగ్రెస్లో చేరారు. ఆ మరుసటి రోజు శనివారం(ఫిబ్రవరి 17) ఆమెపై అవిశ్వాసం నోటీసు ఇవ్వడం వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ మేరకు అవిశ్వాసం నోటీసును 12 మంది బీఆర్ఎస్ సభ్యులు కలిసి జెడ్పీ సీఈవోకు అందించారు. సునీతామహేందర్రెడ్డి బీఆర్ఎస్ నుంచే జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్పర్సన్ పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అవిశ్వాసం గనుక నెగ్గితే సునీతామహేందర్రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ పదవి కోల్పోవాల్సి ఉంటుంది. సునీతామహేందర్రెడ్డితో పాటు ఆమె భర్త మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్కు రేవంత్ బర్త్ డే విషెస్ -
నేవీ రాడార్ స్టేషన్ కోసం అటవీ భూములు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వికారాబాద్ మండలం పూ డూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ (రాడార్) స్టేషన్ ఏ ర్పాటు ఖరారయ్యింది. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని తూర్పు నౌకాదళ కమోడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ కలి శారు. వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటు కోసం అట వీ భూముల బదిలీ ఒప్పందంపై వికారాబాద్ డీఎఫ్వో, నా వల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు సంతకాలు చేశారు. దామ గూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. దేశంలోనే రెండోది భారత నావికాదళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేష న్ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను ఉపయోగిస్తుంది. దామగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసే స్టేష న్ దేశంలో రెండోది కాగా.. తమిళ నాడులోని తిరునల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొదటిది. రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఎప్పుడో గుర్తించింది. 2010 నుంచే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావ రణ అనుమతులు, క్లియరెన్స్లన్నీ వచ్చినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. వాస్తవానికి 2014లోనే నేవీ ప్రతిపాదనలకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూసంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు రూ.18.56 కోట్లు కూడా నేవీ చెల్లించింది. అయితే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని దామగూడెం ఫారెస్ట్ ప్రొటెక్షన్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉండటంతో దానికి ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు నేవీ అంగీకరించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం కూడా నౌకాదళ అధికారులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ దిశగా ముందడుగు పడింది. 2027లో పూర్తి దామగూడెంలో నేవీ స్టేషన్తో పాటు ఏర్పడే టౌన్షిప్లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. దాదాపు 600 మంది నావికా దళంతో పాటు ఇతర సాధారణ పౌరులుంటారు. దాదాపు 2,500 నుంచి 3,000 మంది ఈ టౌన్షిప్లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడతారు. ప్రాజెక్టులో భాగంగా దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కి.మీ. రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త వీఎల్ఎఫ్ సెంటర్ ఏర్పాటు పూర్తి కానుంది. -
వికారాబాద్: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు
వికారాబాద్, సాక్షి: అనంతగిరి అడవుల్లో శనివారం మధ్యాహ్నాం ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. అడవుల్లోని పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. మరో 20 మందికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ప్రయాణికులను వికారాబాద్ నుంచి తాండూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అనంతగిరి గుట్ట దిగుతుండగా కెరెల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొదల్లోకి వెళ్లింది. ఆ సమయంలో బస్సులో వంద మంది ఉన్నట్లు తెలుస్తోంది. స్వల్ప గాయాలైన వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్సలు నిర్వహిస్తున్నారు. -
రోడ్డు కనబడక చెరువులోకి దూసుకెళ్లి..
అనంతగిరి: సరదాగా విహారయాత్ర కోసం బయలుదేరిన వారిని పొగమంచు కమ్మేసింది. దట్టంగా కమ్ముకున్న పొగమంచుతో రోడ్డు సరిగా కనబడక.. కారు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న ఐదుగురిలో నలుగురు ఈదుకుంటూ బయటికిరాగా.. ఒకరు నీట మునిగి మృతి చెందారు. వికారాబాద్ పట్టణ శివార్లలోని శివారెడ్డిపేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి బయటపడినవారు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి వెళదామని బయలుదేరి.. ఏపీలోని అనకాపల్లి జిల్లా దేవరాంపల్లి మండలం మామిడిపల్లికి చెందిన గుణశేఖర్ (24), వైజాగ్కు చెందిన సాగర్, రఘుపతి, చిత్తూరు జిల్లాకు చెందిన పూజిత, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మోహన్ ఐదుగురూ స్నేహితులు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి అనంతగిరి గుట్టలకు విహారయాత్ర కోసం బయలుదేరారు. వికారాబాద్ పట్టణ శివార్లలోని శివారెడ్డిపేట్ చెరువు వద్ద ప్రయాణిస్తున్న సమయంలో పొగ మంచు దట్టంగా అలుముకుని ఉంది. దీనితో రోడ్డు సరిగా కనిపించక కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈత వచ్చిన రఘు నీట మునిగిపోతున్న సాగర్ను బయటికి తీసుకువచ్చాడు. కారు నడుపుతున్న మోహన్, పూజిత కూడా సురక్షితంగా బయటికి రాగలిగారు. గుణశేఖర్ నీటిలో మునిగిపోయాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితులను వికారాబాద్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్రేన్ సాయంతో కారును బయటికి తీశారు. కారు చెరువులో పడిన సమయంలో తమను కాపాడాలని కేకలు వేసినా.. ఒడ్డున ఉన్న కొందరు సెల్ఫోన్లలో వీడియో తీసుకుంటూనే నిలబడ్డారని బాధితులు పేర్కొన్నారు. సుదీర్ఘ గాలింపు తర్వాత.. గజ ఈతగాళ్లతో గుణశేఖర్ కోసం గాలింపు చేపట్టారు. ప్రమాదం విషయం తెలిసిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఘటనా స్థలికి చేరకుని సహాయక చర్యలను వేగిరం చేయాలని సూచించారు. సుమారు 11 గంటలపాటు గాలించిన తర్వాత సోమవారం సాయంత్రం గుణశేఖర్ మృతదేహం లభ్యమైంది. -
పొగ మంచు కారణంగా చెరువులోకి దూసుకెళ్లిన కారు
పొగ మంచు కారణంగా చెరువులోకి దూసుకెళ్లిన కారు
Related News by category
-
ఒకే కుటుంబం.. కేంద్రాలనేకం!
సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వారిద్దరి పిల్లలకు ఓటు హక్కు ఉంది. అందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు అందరూ కలిసి వెళ్లవచ్చులే అనుకున్నారు.అందరూ ఒకేసారి వెళ్లి, రావచ్చుననుకున్నారు.అందుకు ఒక ఆటోలో వెళ్తే సరిపోతుంది అనుకుంది ఆ మధ్య తరగతి కుటుంబం. ఇంటింటికి వచ్చి ఇచ్చిన పోల్ స్లిప్ చూస్తే కుటుంబంలోని భర్తకు ఒక పోలింగ్ కేంద్రం, భార్యకు మరో పోలింగ్ కేంద్రంలో ఓటు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ ఒకే లొకేషన్ రావడం కొంతలో కొంత నయం. లొకేషన్ ఒకటే అయినా వారి పోలింగ్ కేంద్రాలు కూడా వేరే. దీంతో పిల్లలిద్దరు మాత్రం పోలింగ్ బూత్దాకా వెళ్లి ఓటేసినా.. భార్యాభర్తలకు చెరో చోట రావడంతో వారు వెళ్లలేదు.ఒక్కొక్కరు ఒక్కో వాహనం సమకూర్చుకోలేకపోవడంతో పాటు కలిసి వెళ్లలేక పోతున్నామనే తలంపుతోనూ వారు ఓటేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఇది ఒక్క నియోజకవర్గంలోని ఒక్క కుటుంబం పరిస్థితి మాత్రమే కాదు. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు ఉంటోంది. నగరంలో పోలింగ్ శాతం తగ్గడానికి ఇదీ ఓ కారణం. ఇలాఎందుకవుతుందో అంతుపట్టడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే నుంచి నవంబర్ మధ్య ఇలా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న 3,60,849 మంది ఓటర్లను కుటుంబమంతటికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లుండే చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం ఈ ప్రక్రియను కొనసాగించింది. 2024 మార్చి నెలాఖరు వరకు అలా 17,864 మంది ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. వెరసి మొత్తం 3,78,713 మంది ఓటర్లకు ఒక కుటుంబంలోని వారు ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. నగరంలో వింత పరిస్థితి పోలింగ్ శాతం తగ్గుదలకు ఇదీ ఓ కారణం! -
అటకెక్కికిన ‘బృహత్’
వికారాబాద్: బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు అటకెక్కినట్లు కన్పిస్తోంది. ఏడాది క్రితమే స్థలాల పరిశీలన పూర్తిచేసిన అధికారులు వాటి ఏర్పాటు కోసం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొన్నిచోట్ల పనులు ప్రారంభించినప్పటికీ అవి ముందుకు సాగడంలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, పట్టణాల్లో పట్టణ ప్రకృతి వనాలు, అర్బన్ పార్కుల పేరుతో పచ్చదనాన్ని పెంచే కార్యక్రమానికి తోడు మండలానికొకటి చొప్పున బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంవీటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఏడాది క్రితమే స్థలాల పరిశీలన పూర్తిచేసినప్పటికీ యంత్రాంగం వీటి ఏర్పాటుపై ఆసక్తి చూపడం లేదని సమాచారం. సమన్వయలోపం... బృహత్ పల్లె ప్రకృతి వనాల స్థల పరిశీలన బాధ్యతలను రెవెన్యూ యంత్రాంగం చూడగా.. ప్రకృతి వనాల అభివృద్ధి బాధ్యతలు మండల పరిషత్, ఉపాధి హామీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏ మొక్కలు నాటాలి, ఎన్ని నాటాలి తదితర వాటిని ఫారెస్టు అధికారులు పర్యవేక్షిస్తారు. పచ్చదనాన్ని పెంచటంతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా వనాల్లో కుర్చీలు, చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో మొదటి ఏడాది మొక్కలు నాటడం..వాటి పెంపకం లాంటి కార్యక్రమాలు చేపట్టాలని, రెండవ ఏడాది నుంచి వనాలను అభివృద్ధి చేయటం, వాటిలో వసతులు కల్పించటం లాంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. అయితే శాఖల మధ్య సమన్వయలోపంతోనే ఇప్పటికీ పనులు ప్రారంభం కావడంలేదనే విమర్శలున్నాయి. మండలానికొకటి చొప్పున.. జిల్లాలో మండలానికొకటి చొప్పున మొత్తం 19 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థలాల లభ్యతను బట్టి మండల కేంద్రాలకు సమీపంలో లేదంటే మండలంలో ఏదో ఒకచోట ఈ వనాలకు స్థలాలను కేటాయిస్తారు. ఒక్కో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని 8 ఎకరాలకు తక్కువ కాకుండా ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో వనంలో సగటున 33వేల చొప్పున మొక్కలు నాటనున్నారు. కాగా ఇప్పటికే ప్రతి మున్సిపాలిటీకి ఒకటి చొప్పున జిల్లాలో నాలుగు అర్బన్ పార్కుల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అలాగే గ్రామానికొకటి చొప్పున జిల్లాలో మొత్తం 715 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలను కూడా త్వరగా ఏర్పాటు చేసి అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో 19 బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రణాళిక ఏడాది క్రితమే స్థలాల కేటాయింపు పూర్తి శాఖల మధ్య సమన్వయ లోపంతో పనుల్లో తీవ్ర జాప్యం అందుబాటులోకి తేవాలంటున్న ప్రజలు పనులు ప్రారంభించాలి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బృహత్ పల్లె ప్రకృతి వనాల స్థలాలు సేకరణ ప్రక్రియ పూర్తయ్యింది. అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలి. పల్లె ప్రకృతి వనాల తరహాలోనే బృహత్ ప్రకృతి వనాలు కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. – విజయ్ కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ -
స్వశక్తితో ఆర్థికాభివృద్ధి సాధించాలి
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ మర్పల్లి: ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన రంగంలో రాణించి ఆర్థికాభివృద్ధి సాధించాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. బుధవారం ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గూడెం కృష్ణయాదవ్ గృహప్రవేశం కార్యక్రమం హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లడుతూ.. ప్రతిఒక్కరూ ఒక స్థితికి చేరుకున్న తర్వాత సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శ్రీనివాస్ యాదవ్ పేదరికం నుంచి స్వశక్తితో ఎదిగి నేడు సొంత ఇల్లునిర్మించుకోవడం అభినందనీయం అన్నారు. సహకార సంఘం చైర్మన్ ప్రవీణ్కుమార్, ఉపాధ్యక్షుడు ఫసీయుద్దీన్, కాంగ్రెస్ నాయకులు రాములు యాదవ్, రాచన్న, బలవంత్రెడ్డి, వెంకట్ తదితరులున్నారు. శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్రమంత్రి ● సతీసమేతంగా హాజరైన కిషన్రెడ్డి ● స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ కందుకూరు: మండల పరిధిలోని తిమ్మాపూర్ రామాలయంలో బుధవారం నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములుయాదవ్, కన్వీనర్ ఎల్మటి దేవేందర్రెడ్డి, ఎంపీపీ మంద జ్యోతిపాండు, నాయకులు అమరేందర్రెడ్డి, నిరంజన్, భిక్షపతి, పాండు, రమేష్గౌడ్ తదితరులు ఉన్నారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా విజయ్కుమార్ ఇబ్రహీంపట్నం రూరల్: బీజేపీ యువమోర్చా జిల్లా కార్యదర్శిగా మైలారం విజయకుమార్ నియమితులయ్యారు. బీజేవైఎం రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడు యాదీష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల కేంద్రానికి చెందిన విజయ్కుమార్ బీజేపీలో చురుకై నపాత్ర పోషించారు. పార్టీ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించిన అధిష్టానం కార్యదర్శిగా నియమించింది. ఆ పరిశ్రమలపై చర్యలు తీసుకుంటాం రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు మెంబర్ సత్యనారాయణరెడ్డి చేవెళ్ల: ప్రజలకు ఇబ్బంది కలిగించే కాలుష్యకారకాలపై తెలంగాణ రాష్ట్ర పర్యావరణ నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బోర్డు సెక్రటరీ బుద్ధ ప్రసాద్ ఐఏఎస్ అధ్యక్షతన నగరంలో బోర్డు సభ్యుల సమావేశం నిర్వహించారని.. చేవెళ్ల ప్రాంతంలోని పలు సమస్యలను బోర్డు దృష్టికి తీసుకెళ్లామన్నారు. తాండూరులోని ఏసియన్ బ్రౌన్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యంతో గ్రామస్తులు, విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని.. చందనవెల్లిలోని కుందన్ టైక్స్టైల్స్, శంషాబాద్ శ్రీకృష్ణ డ్రగ్స్తోనూ పర్యావరణం కాలుష్యమవుతోందని చెప్పానన్నారు. మోకిలలో నిర్మిస్తున్న విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణ వ్యర్థాలు గండిపేట చెరువులోకి వదులుతున్నారని ప్రస్తావించానన్నారు. మోకిలలోని నిర్మాణాలను సందర్శించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు బోర్డు నిర్ణయించిందని చెప్పారు. మొదటిసారి సమావేశానికి హాజరైన నూతన మెంబర్లను బోర్డు ఆధ్వర్యంలో సన్మానించినట్లు వివరించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. పర్యావరణానికి, ప్రజలకు హాని కలిగించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీబీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
వరకట్నం వేధింపులకు వివాహిత బలి
పరిగి: అదనపు వరకట్నం కోసం భర్త, అత్తమామ పెట్టిన వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మండలంలోని నస్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సంతోష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జైనబేగం, గౌస్ దంపతుల పెద్ద కుమార్తె షహీన్బేగం(24)ను పూడూర్ మండలం గొంగుపల్లి గ్రామానికి చెందిన రఫీకి ఇచ్చి ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేశారు. ఆ సమయంలో పెద్దల సమక్షంలో రూ.16 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేయించారు. కానీ పెళ్లయిన మరుసటి నెల నుంచి భర్త, అత్తమామ, ఆడపడుచు నిత్యం అదనపు కట్నం కోసం మానసికంగా, శరీరకంగా వేధింపులకు గురిచేశారు. వీటిని భరించలేక షహీన్బేగం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి మాట్లాడాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో ఈనెల 12న షహీన్బేగంను భర్త తల్లిగారి ఇంట్లో వదిలి వెళ్లాడు. దీంతో మానసికంగా బాధపడుతూ ఆమె మంగళవారం రాత్రి గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి జైనబేగం బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.నస్కల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న వైనం -
ఎన్నికలకు సై
నేడే లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్ ● ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ● 18, 19, 24 తేదీల్లో శుభ ముహూర్తాలు ● నామినేషన్ల దాఖలుకు సమాయత్తమైన అభ్యర్థులుసాక్షి, రంగారెడ్డిజిల్లా: సార్వత్రిక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ వెలువడనుంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. అధికార యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లలో తలమునకలైంది. ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీ వంటి అంశాలపై గట్టి నిఘా తదితర చర్యలు చేపట్టింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తుంది. యువత, మహిళలు, వృద్ధులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తుంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కోసం మంచి ముహూర్తాలను అన్వేశిస్తున్నారు. ఇప్పటికే పంతుళ్లను ఆశ్రయించి, ఏ రోజు నామినేషన్ వేయాలనే అంశంపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. శుభ ముహూర్తాలు ● 18 గురువారం దశమి, మగ నక్షత్రం మంచి రోజు కావడంతో అభ్యర్థులు సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ● 19న శుక్రవారం, ఏకాదశి, ముఖ నక్షత్రం మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజే నామినేషన్లు వేసేందుకు మెజార్టీ అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. ● 24న బుధవారం చైత్ర బహుళ పాడ్యమితో పాటు స్వాతి నక్షత్రం, చాలా బాగుంది. ఈ రోజు నామినేషన్లు సమర్పిస్తే.. అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. ● 22 సోమవారం చతుర్థశి, అష్టానక్షత్రం. నామినేషన్ల దాఖలు మంచి రోజు. ● 21న ఆదివారం త్రయోదశి, ఉత్తర నక్షత్రం.. పై ముహుర్తాల కంటే ఇది యోగ్యమైనది. కానీ ఆరోజు సెలవు కావడంతో అభ్యర్థులు ముందు రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి వస్తుంది. ● గతంలో నామినేషన్ల కార్యక్రమం చాలా అట్టహాసంగా చేసే వారు. భారీగా జనాన్ని సమీకరించి, ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎండలు భగ్గున మండుతుండటంతో పార్టీ శ్రేణులు సైతం బయటికి వెళ్లేందుకు జంకుతున్నాయి. ఈ నేపథ్యంలో సాదాసీదాగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలు ఇలా ● అభ్యర్థులు నామినేషన్ ఫారం–2ఎ ను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు. ● ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ● అభ్యర్థి వెంట మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతి. ● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఒక ఓటరు నామినేషన్ను ప్రతిపాదించాలి. ● అదే రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలు/ స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ఓటర్లు నామినేషన్ను ప్రతిపాదించాల్సి ఉంది. ● అభ్యర్థులు 3నెలలలోపు దిగిన ఒక పాస్పోర్ట్ సైజు ఫొటోను అఫిడవిట్పై అతికించాలి. ● నామినేషన్పత్రంపై స్టాంప్ సైజు ఫొటో పెట్టాలి. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేరే పార్లమెంట్ సెగ్మెంట్కు చెందిన వారైతే విధిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ వీఆర్ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. ●రిజస్టర్/గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారంలోని పార్ట్–3లో సి కాలం ఎదుట ఎన్నికల సంఘం నిర్ధేశించిన గుర్తుల్లో ఏదైనా మూడు గుర్తులను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసి, ఆ వివరాలను పొందుపరచాలి. ● పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ● అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అనుమతి. ● ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ పక్కాగా నిర్వహించాలి. నామినేషన్ల స్వీకరణ కోసం రాజేంద్రనగర్ తహహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు, భద్రత కోసం చేవెళ్లలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీని ఎంపిక చేశారు. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో మొత్తం 29,28,186 మంది ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. మొత్తం 2,877 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎన్నికల నిర్వహణకు 13,443 పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల నిబంధనలు పాటించాలని.. అతిక్రమిస్తే చర్యలు తప్పవని అన్నారు.చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయనున్న తేదీ బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 19 బీజేపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి 22 కాంగ్రెస్ గడ్డం రంజిత్రెడ్డి 25 షెడ్యూల్ ఇలా.. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏప్రిల్ 18న నోటిఫికేషన్ ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రతి రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా విడుదల మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జూన్ 6తో ఎన్నికల ప్రక్రియ ముగింపు.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
IPL 2024: సీఎస్కేను చిత్తు చేసిన పంజాబ్.. ఘనమైన రికార్డు
గోల్డ్ స్పాట్ కుటుంబం.. గోల్మాల్ ‘గీతం’
మళ్లీ జగన్ రావాలి
చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో
జేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
Photos
View allVideo
View allతప్పక చదవండి
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
Advertisement