‘తృప్తి’గా ఉంది | 2017 Mrs India trupthi | Sakshi
Sakshi News home page

‘తృప్తి’గా ఉంది

Jul 13 2017 9:13 AM | Updated on Sep 5 2017 3:57 PM

‘తృప్తి’గా ఉంది

‘తృప్తి’గా ఉంది

బెంగళూరు నగరానికి చెందిన తృప్తి 2017వ సంవత్సరానికి మిసెస్‌ ఇండియా కిరీటం అందుకున్నారు.

► మిసెస్‌ ఇండియా తృప్తి 
►  బెంగళూరు వనితకు అందాల కిరీటం
 
శివాజీనగర: బెంగళూరు నగరానికి చెందిన తృప్తి 2017వ సంవత్సరానికి మిసెస్‌ ఇండియా కిరీటం అందుకున్నారు. నగరంలో ఒక ప్రముఖ సంస్థలో మానవ వనరుల విభాగం ఉన్నతోద్యోగి అయిన తృప్తి మిసెస్‌ ఇండియా కిరీటాన్ని గెల్చుకున్నారని మిసెస్‌ ఇండియా కర్ణాటక విభాగం డైరెక్టర్‌ ఎస్‌.ప్రతిభా సౌశీమత్‌ తెలిపారు. బుధవారం వారిద్దరూ బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు.

దేశవ్యాప్తంగా 700 మంది అభ్యర్థులు ఈ పోటీల్లో తలపడ్డారు. అందులో తృప్తి విజేతగా నిలిచిందని తెలిపారు. భారతీయ సంస్కృతి, తొమ్మిది గజాల పట్టుచీరను ధరించి నడవటంలోను ఆమె ప్రతిభను చూపించారు. ఈ నెల 4న చెన్నైలో జరిగిన తుది పోటీల్లో 25 మంది కిరీటం కోసం పోటీ పడ్డారు. ఈ గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని తృప్తి చెప్పారు. ఈ పోటీల్లో పాల్గొనటం ద్వారా అనేక విషయాలు నేర్చుకోగలిగానని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement