వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది.
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
Sep 16 2016 4:03 PM | Updated on Sep 4 2017 1:45 PM
నిజామాబాద్: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. పార్వతి తనయుడిని నిమజ్జనానికి తరలిస్తున్న వాహనానికి విద్యుత్ తీగలు తాకడంతో దాని పై ఉన్న ఓ యువకుడు విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లాలోని ఎల్లంగూట ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తుండగా.. వాహనం పై ఉన్న నరేష్(28)కు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement