'ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెస్తే రూ. 6 కోట్లు ఇస్తాం' | Uttar Pradesh hikes prize money for Olympic winners | Sakshi
Sakshi News home page

'ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెస్తే రూ. 6 కోట్లు ఇస్తాం'

Nov 12 2014 9:52 PM | Updated on Sep 2 2017 4:20 PM

'ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెస్తే రూ. 6 కోట్లు ఇస్తాం'

'ఒలింపిక్ గోల్డ్ మెడల్ తెస్తే రూ. 6 కోట్లు ఇస్తాం'

ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించే ఉత్తప్రదేశ్ క్రీడాకారుల పంట పండనుంది.

లక్నో: ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించే ఉత్తప్రదేశ్ క్రీడాకారుల పంట పండనుంది. రానున్న ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించిన వారికి ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని యూపీ ప్రభుత్వం భారీగా పెంచింది.

ఒలింపిక్స్ లో స్వర్ణ పతక విజేతలకు రూ. 6 కోట్లు, వెండి పతకం గెలిచిన వారికి రూ. 4 కోట్లు, కంచు పతకం తెస్తే రూ. 2 కోట్లు ఇస్తామని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. 35వ జాతీయ జూనియర్ రౌలింగ్ చాంపియన్ షిప్ పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు. యూపీ రౌలింగ్ అసోసియేషన్ వెబ్ సైట్ ను ఆవిష్కరించి, సావనీర్ విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement