స్వదేశం చేరుకున్న టీమిండియా | Team india reached to india | Sakshi
Sakshi News home page

స్వదేశం చేరుకున్న టీమిండియా

Jan 2 2014 1:08 AM | Updated on Oct 17 2018 4:43 PM

ముంబై విమానాశ్రయంలో ధోని - Sakshi

ముంబై విమానాశ్రయంలో ధోని

దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకున్న భారత క్రికెట్ జట్టు బుధవారం ఉదయం స్వదేశానికి చేరుకుంది. జట్టు మొత్తం కలిసి ముంబైకి వచ్చిన అనంతరం ఆటగాళ్లు తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు.

ముంబై: దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకున్న భారత క్రికెట్ జట్టు బుధవారం ఉదయం స్వదేశానికి చేరుకుంది. జట్టు మొత్తం కలిసి ముంబైకి వచ్చిన అనంతరం ఆటగాళ్లు తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు.
 
 కోచ్ డంకన్ ఫ్లెచర్, బౌలింగ్ కోచ్ జో డాస్ మాత్రం జట్టుతో తిరిగి రాలేదని, వారు న్యూజిలాండ్‌కు బయల్దేరే ముందు టీమిండియాతో కలుస్తారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం ఈ నెల 11న జరిగే బీసీసీఐ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని భారత జట్టు కివీస్ పర్యటనకు బయల్దేరుతుంది. ముందుగా వన్డే జట్టు, వారం తర్వాత టెస్టు జట్టు వెళుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement