భారీ ఆధిక్యం దిశగా భారత్ ‘ఎ’ | team "A" is leading in test match | Sakshi
Sakshi News home page

భారీ ఆధిక్యం దిశగా భారత్ ‘ఎ’

Aug 20 2013 3:17 AM | Updated on Sep 1 2017 9:55 PM

భారీ ఆధిక్యం దిశగా భారత్ ‘ఎ’

భారీ ఆధిక్యం దిశగా భారత్ ‘ఎ’

దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత ‘ఎ’ బౌలర్లు చెలరేగారు. ఫలితంగా సోమవారం మూడో రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. జేపీ డుమిని (222 బంతుల్లో 84; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


   రస్టెన్‌బర్గ్: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత ‘ఎ’ బౌలర్లు చెలరేగారు. ఫలితంగా సోమవారం మూడో రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. జేపీ డుమిని (222 బంతుల్లో 84; 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ఈశ్వర్ పాండే 40 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మరో 270 పరుగులు వెనుకబడి ఉన్న నేపథ్యంలో... భారత్‌కు భారీ ఆధిక్యం ఖాయమైపోయింది. మంగళవారం మ్యాచ్‌కు చివరి రోజు కావడంతో ఈ టెస్టు డ్రాగా ముగిసే అవకాశం ఉంది. అయితే జట్టు బ్యాట్స్‌మెన్‌కు తోడు బౌలర్లు కూడా రాణించడం భారత్ ‘ఎ’కు శుభ పరిణామంగా చెప్పవచ్చు.
 
 రాణించిన డుమిని...
 20/1 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా ‘ఎ’ ఆరంభంలోనే ఎల్గర్ (11) వికెట్ కోల్పోయింది. అయితే రోసో (64 బంతుల్లో 57; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్మర్ (22) కలిసి మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ దశలో హార్మర్‌ను అవుట్ చేసి పాండే దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు. అనంతరం డుమిని కీలక ఇన్నింగ్స్‌తో జట్టు కోలుకుంది. కెప్టెన్ ఆంటాంగ్ (82 బంతుల్లో 47; 7 ఫోర్లు) తో కలిసి ఆరో వికెట్‌కు 75 పరుగులు, సొలెకిల్ (75 బంతుల్లో 47; 6 ఫోర్లు)తో ఏడో వికెట్‌కు 86 పరుగులు డుమిని జత చేశాడు. చివరి ఓవర్‌లో రైనా బౌలింగ్‌లో డుమిని అవుట్ కావడంతో  మూడో రోజు ఆట ముగిసింది. రైనాకు 2 వికెట్లు దక్కాయి. ఏర్పాట్లు బాగున్నాయి: కార్ల్‌సన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement