టీమిండియా లక్ష్యం 287 | south africa set target of 287 runs for india in second test | Sakshi
Sakshi News home page

టీమిండియా లక్ష్యం 287

Jan 16 2018 7:37 PM | Updated on Jan 16 2018 7:44 PM

south africa set target of 287 runs for india in second test - Sakshi

సెంచూరియన్‌:టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగుల వద్ద ఆలౌటైంది. 90/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో నాల్గో రోజు ఇన్నింగ్స్‌ కొనసాగించిన సఫారీలు.. మరో 168 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయారు. దాంతో భారత్‌కు 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఈ రోజు ఆటలో డివిలియర్స్‌(80;121 బంతుల్లో 10 ఫోర్లు), డీన్‌ ఎల్గర్‌ (61;121 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్సర్‌), డీకాక్‌(12; 5 బంతుల్లో 3 ఫోర్లు)లను స్వల్ప వ్యవధిలో అవుట్‌ కాగా, డు ప్లెసిస్‌(48;141 బంతుల్లో 4 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. డు ప్లెసిస్‌కు ఫిలిండర్‌(26;85 బంతుల్లో 2 ఫోర్లు) నుంచి చక్కటి సహకారం లభించింది. ఈ జోడి ఆరో వికెట్‌కు 46 పరుగుల్ని భాగస్వామ్యాన్ని సాధించగా, అటు తరువాత డు ప్లెసిస్‌- రబడా(29 బంతుల్లో 4) ల జోడి 30 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసింది. టీమిండియా బౌలర్లలో మొహ్మద్‌ షమీ నాలుగు వికెట్లు సాధించగా, బూమ్రా మూడు వికెట్లు తీశాడు. ఇక ఇషాంత్‌ శర్మ రెండు, అశ్విన్‌ ఒక వికెట్‌ తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement