శిఖర్ ధవన్ సెంచరీ | shikhar dhawan gets century | Sakshi
Sakshi News home page

శిఖర్ ధవన్ సెంచరీ

Sep 27 2015 8:02 PM | Updated on Sep 3 2017 10:05 AM

శిఖర్ ధవన్ సెంచరీ

శిఖర్ ధవన్ సెంచరీ

బంగ్లాదేశ్ 'ఎ'తో జరుగుతున్న మూడు రోజుల మ్యాచ్ లో భారత 'ఎ' జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

బెంగళూరు: బంగ్లాదేశ్ 'ఎ'తో జరుగుతున్న మూడు రోజుల మ్యాచ్ లో భారత 'ఎ' జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ధవన్(116; 112 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్ లు ) సాయంతో శతకం సాధించి నాటౌట్ గా క్రీజ్ లో ఉన్నాడు.  దీంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత'ఎ' జట్టు వికెట్ నష్టానికి 161 పరుగులు చేసింది. ధవన్ కు జతగా ఐయ్యర్(6) క్రీజ్ లో ఉన్నాడు.

 

అంతకుముందు టాస్ గెలిచిన భారత 'ఎ' జట్టు బంగ్లాకు బ్యాటింగ్ అప్పగించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లా 228 పరుగులకే ఆలౌటయ్యింది.  బంగ్లా ఆటగాళ్లలో షబ్బిర్ రహమాన్(122),  సువగాటా హమ్(62) మినహా ఎవరూ రాణించలేదు. బంగ్లా ఆటగాళ్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ అరోన్, జయంత్ యాదవ్ లు తలో నాలుగు వికెట్లు తీసి బంగ్లా వెన్నువిరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement