వెనిజులాలో జరుగుతున్న రియో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ నీరజ్ గోయట్ సెమీఫైనల్లోకి...
న్యూఢిల్లీ: వెనిజులాలో జరుగుతున్న రియో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ నీరజ్ గోయట్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 69 కేజీల విభాగం క్వార్టర్ఫైనల్లో నీరజ్ 3-0తో దిమిత్రోస్ పౌలికోస్ (గ్రీస్)పై నెగ్గాడు. గురువారం జరిగే సెమీస్లో భారత బాక్సర్... రెండోసీడ్ ఆర్జిక్ మార్తుజన్ (జర్మనీ)తో తలపడతాడు. ఈ బౌట్లో నెగ్గితే నీరజ్కు ఒలింపిక్స్ బెర్త్ ఖాయమవుతుంది. ఒకవేళ ఇందులో ఓడినా మరో అవకాశం ఉంటుంది. సెమీస్లో ఓడిన ఇద్దరు బాక్సర్ల మధ్య జరిగే పోటీలో నెగ్గితే రియో బెర్త్ దక్కుతుంది. మరోవైపు 52 కేజీల తొలి రౌండ్లో గౌరవ్ బిదురి... మాక్సమ్ ఫెట్చ్ (ఉక్రెయిన్) చేతిలో; 81 కేజీల బౌట్లో దిల్బాగ్ సింగ్ 1-2తో పెట్రూ కొబాన్ (మల్దోవా) చేతిలో ఓడిపోయారు.