మెయిన్ ‘డ్రా’కు ప్రజ్నేశ్

మయామి ఓపెన్
మయామి: భారత నంబర్వన్ సింగిల్స్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ మయామి ఓపెన్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో మెయిన్ డ్రాకు అర్హత సంపాదించాడు. ఇటీవల ఇండియన్ వెల్స్లోనూ మెయిన్ డ్రా చేరిన అతను వారం వ్యవధిలో వరుసగా రెండో మాస్టర్స్ టోర్నీలో ఈ ఘనత సాధించాడు. గురువారం జరిగిన రెండో క్వాలిఫయింగ్ మ్యాచ్లో అతను 6–4, 6–4తో బ్రిటన్కు చెందిన క్లార్క్ను కంగుతినిపించాడు. ఈ వారమే కెరీర్ బెస్ట్ సింగిల్స్ 84వ ర్యాంకుకు ఎగబాకిన ప్రజ్నేశ్ వరుస సెట్లలో ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశమివ్వకుండా చెలరేగాడు. శుక్రవారం జరిగే మెయిన్ డ్రా తొలి రౌండ్ మ్యాచ్లో 29 ఏళ్ల భారత ఆటగాడు జేమ్ మునర్ (స్పెయిన్)తో తలపడతాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి