క్వార్టర్స్‌లో నిధి జోడి | nidhi team entered in quarter finals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో నిధి జోడి

Apr 8 2014 11:54 PM | Updated on Sep 2 2017 5:45 AM

అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ఫ్యూచర్స్ టోర్నీ డబుల్స్‌లో నిధి చిలుముల జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.

ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ
 చెన్నై: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ఫ్యూచర్స్ టోర్నీ డబుల్స్‌లో నిధి చిలుముల జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక్కడి మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిధి, చైనాకు చెందిన జియావో వాంగ్‌తో కలిసి బరిలోకి దిగింది. ఈ నాలుగో సీడ్ జంట తొలి రౌండ్‌లో 6-2, 6-2 స్కోరుతో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన యడ్లపల్లి ప్రాంజల- రియా భాటియా (భారత్)పై విజయం సాధించింది.
 
 మరో డబుల్స్ మ్యాచ్‌లో ఏపీకే చెందిన స్నేహ పడమట-వానియా దంగ్వాల్ (భారత్) జోడి 6-1, 6-3తో భవాని బాల కుమార్-రేష్మ గణపతి (భారత్) జంటను ఓడించి క్వార్టర్స్ ఫైనల్స్‌కు చేరుకుంది. సింగిల్స్ విభాగం తొలి రౌండ్‌లో మరో తెలుగమ్మాయి రిషిక సుంకర కూడా విజయాన్ని అందుకుంది. మూడో సీడ్ రిషిక 6-1, 6-2 స్కోరుతో ఆర్తి మునియన్‌పై గెలుపొంది రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. బుధవారం జరిగే సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నిధి, ప్రాంజల తలపడనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement