
సాక్షి, స్పోర్ట్స్ : భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన లంక జట్టు బ్యాటింగ్ను ఎంచుకుంది. మూడు మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది. రోహిత్, విజయ్, ఇషాంత్శర్మలకు జట్టులో చోటు దక్కింది. ప్రస్తుతం లంక 2 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. సమరవిక్రమ 6 పరుగులు, కరుణరంతే 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.