టీమిండియాతో ఆ సిరీస్ అద్భుతం: పాంటింగ్ | India and Australia Test series in 2011 the most remarkable I’ve played in, says Ricky Ponting | Sakshi
Sakshi News home page

టీమిండియాతో ఆ సిరీస్ అద్భుతం: పాంటింగ్

Sep 8 2016 1:46 PM | Updated on Sep 4 2017 12:41 PM

టీమిండియాతో ఆ సిరీస్ అద్భుతం: పాంటింగ్

టీమిండియాతో ఆ సిరీస్ అద్భుతం: పాంటింగ్

దాదాపు 16 సంవత్సరాల క్రితం భారత్తో స్వదేశంలో తాము ఆడిన టెస్టు సిరీస్ తన కెరీర్లోనే చిరస్మరణీయమైనదిగా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభివర్ణించాడు.

ముంబై:దాదాపు 16 సంవత్సరాల క్రితం భారత్తో స్వదేశంలో తాము ఆడిన టెస్టు సిరీస్ తన కెరీర్లోనే చిరస్మరణీయమైనదిగా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్  అభివర్ణించాడు. 2001లో ఇరు జట్ల మధ్య జరిగిన ఆ దైపాక్షిక టెస్టు సిరీస్ తన కెరీర్లోనే అద్భుతమైనదని పాంటింగ్  స్పష్టం చేశాడు. ఆ సిరీస్లో తాము ఓడినప్పటికీ, క్రికెట్ ఏ స్థాయిలో ఉండాలో అదే తరహాలో ఆ సిరీస్ జరిగిందన్నాడు. అయితే ఇందులో ప్రత్యేకంగా కోల్ కతా నగరంలోని ఈడెన్ గార్డెన్లో జరిగిన టెస్టు మ్యాచ్ మాత్రం సిరీస్కే హైలైట్ అని పాంటింగ్ తెలిపాడు. 

 

ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తాము భారీ ఇన్నింగ్స్ చేసి భారత్ ను ఫాలో ఆన్లోకి నెట్టినా, ఆ తరువాత ఆ జట్టు పుంజుకున్న తీరు అమోఘమన్నాడు. రెండో ఇన్నింగ్స్ లో వీవీఎస్ లక్ష్మణ్ చేసిన  280 పరుగులు, రాహుల్ ద్రవిడ్ చేసిన 180 పరుగులు భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాయన్నాడు. ఆ తరువాత చెన్నైలో చిదంబరం స్టేడియంలో జరిగిన మూడో టెస్టు కూడా అత్యంత ఆసక్తిని రేపిందని తన గత జ్ఞాపకాల్ని పాంటింగ్ గుర్తు చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా మరుపురాని విజయాన్ని కైవసం చేసుకుని సిరీస్ను 2-1 తో గెలుచుకుందన్నాడు. ఈ సిరీస్లో ముంబై లో జరిగిన తొలి టెస్టులో 10 వికెట్లతో ఆస్ట్రేలియా విజయం సాధించిన తరువాత టీమిండియా పుంజుకున్న విధానం తన క్రికెట్ కెరీర్లోనే అరుదైన సిరీస్గా పాంటింగ్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement